Microsoft unveils Lumia 430
Publish Date:May 16, 2015
సరికొత్త యుఫొరియా స్మార్ట్ ఫోన్
Publish Date:May 13, 2015
చేతి రాతను టెక్ట్స్ గా మార్చే యాప్
Publish Date:Apr 21, 2015
ఫోన్ పోయిందా.. గూగుల్ వెతికిపెడుతుంది
Publish Date:Apr 17, 2015
స్మార్ట్ఫోన్తో సమస్యలా
Publish Date:Apr 11, 2015
ఒక్క నిమిషంలో ఛార్జింగ్...
Publish Date:Apr 9, 2015
మైక్రోసాఫ్ట్ సరికొత్త మొబైల్ మోడల్స్
Publish Date:Apr 8, 2015
ఆపిల్ తాళాలు రాబోతున్నాయ్
Publish Date:Apr 6, 2015
హీరో కొత్త ఇ-రిక్షా రాహీ
Publish Date:Apr 3, 2015
ఫేస్ బుక్ కొత్త యాప్ రిఫ్
Publish Date:Apr 2, 2015
మార్కెట్లోకి శామ్సంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్ఫోన్లు
Publish Date:Mar 24, 2015
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లొస్తున్నాయ్
Publish Date:Mar 20, 2015
డాటావిండ్ కొత్త స్మార్ట్ ఫోన్లు
Publish Date:Mar 18, 2015
సూపర్ ఫాస్ట్ రోబో వచ్చేసింది
Publish Date:Mar 17, 2015
మార్కెట్లోకి బ్లాక్ బెర్రి కొత్త 'సెక్యూటాబ్లెట్'
Publish Date:Mar 16, 2015
యూట్యూబ్... కొత్త సంచలనం
Publish Date:Mar 13, 2015
షియోమి నుంచి కొత్త ఫోన్, టాబ్లెట్
Publish Date:Mar 12, 2015
యాపిల్ "స్మార్ట్ వాచ్"
Publish Date:Mar 11, 2015
సరికొత్త మోటో-ఈ మొబైల్
Publish Date:Mar 10, 2015
చిరంజీవి మళ్లీ పొలిటికల్ ఎంట్రీ! నాదెండ్ల కామెంట్ల అర్ధమేంటీ?
ఏపీ రాజకీయాల్లోకి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా..? తమ్ముడు వెంటే అనయ్య నడవబోతున్నారా..? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. పంచాయితీ ఎన్నికల వేళ తన వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెంచారు జనసేన నేత నాదెండ్ల మనోహార్. విజయవాడలో జరిగిన జనసేన క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో మెగాస్టార్ పొలిటికల్ రీ ఎంట్రీపై మనోహర్ కీలక కామెంట్స్ చేశారు. త్వరలో పవన్ కల్యాణ్ వెంట చిరంజీవి రాబోతున్నారని ప్రకటించారు. పవన్ కు అండగా ఉంటామని చిరంజీవి హామీ ఇచ్చారని తెలిపారు. అంతేకాదు పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కారణం చిరంజీవేనని చెప్పారు నాదేండ్ల మనోహర్. రెండు మూడేళ్లు సినిమాలు చేసిన తర్వాత రాజకీయాలు చేసుకోవాలని తర్వాత నీ రాజకీయ ప్రస్థానంలో నేను కూడా నీకు అండగా నిలబడతానని.. నీతో కలిసి నడుస్తానంటూ చిరంజీవి పవన్ కు హామీ ఇచ్చారని మనోహర్ తెలిపారు. చిరంజీవి పెరు నాదెండ్ల చెప్పగానే.. జనసేన కార్యకర్తలు, కేరింతలు కొట్టారు. నాదెండ్ల మనోహర్ తాజా కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి చిరంజీవి ఏం చేస్తారన్నదానిపై చర్చ జరుగుతూనే ఉంది. చిరంజీవి జనసేనకు దూరంగా ఉన్నా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం పవన్ కు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. నాగబాబు జనసేనలో క్రియాశీలకంగా ఉన్నారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్.., సోషల్ మీడియాలో జనసేనకు మద్దతు పలకగా.. వరుణ్ తేజ్, నిహారికా నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ కూడా జనసేనకు మద్దతుగా ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. చిరంజీవి బహిరంగంగా మద్దతు పలకకపోయినా.., తమ్ముడికి నైతికి మద్దతు ఇస్తూనే ఉన్నారు. జనసేన వైపు ఉండాలని అభిమాన సంఘాలకు సూచించారు. మెగాస్టార్ కు రాజకీయాలు కొత్త కాదు. గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజకీయాలకు దూరమయ్యారు చిరంజీవి. పవన్ పార్టీ ప్రకటించినప్పుడు కూడా.. ఎన్ని ఒత్తిళ్లు, విమర్శలు వచ్చినా ఆయన తన పొలిటికల్ రీఎంట్రీకి సంబంధించి నోరెత్తలేదు. అయితే నాదెండ్ల మనోహార్ తాజా వ్యాఖ్యలతో పవన్ పార్టీకి చిరంజీవి మద్దతుపై మెగా అభిమానులకు ఫుల్ క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు. ఇక్కడ తోడుగా రావడం అంటే పవన్ కు మద్దతుగా చిరంజీవి జనసేనలో చేరటం ఖాయమేనని చెబుతున్నారు. కాస్త లేట్ అయిన చిరు మళ్లీ పొలిటిక్స్ లో రీ ఎంట్రీ ఇస్తారని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, త్వరలో జరగనున్న తిరుపతి ఉపఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల్లో ఉన్న మెగా అభిమానులను జనసేన వైపు తిప్పడానికి మనోహర్ ఇలా మాట్లాడి ఉంటారా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ఆ ఐదు రాష్ట్రాలకే 34 పద్మలు ! అవార్డుల్లోనూ ఓట్ల రాజకీయమేనా?
భారత దేశంలో అత్యున్నత పురస్కారాలు పద్మ అవార్డులు. వివిధ రంగాల్లోని ప్రముఖులను గుర్తించి ప్రతి ఏటా గణతంత్రం దినోత్సవం ముందు రోజు ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే ప్రతిభ ఆధారంగా ఇవ్వాల్సిన ఈ దేశ అత్యున్నత పురస్కారాలపైనా రాజకీయ ముద్ర పడిందనే ఆరోపణలు ఎప్పటి నుంచే ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీ.. తమకు అనుకూలంగా ఉన్నవారికే పురస్కారాలను అంద చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. అందుకే కొందరు విమర్శకులు వీటిని "రాజకీయ పద్మాలు" అని చెబుతుంటారు. తాజాగా 2021 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపైనా రాజకీయ దుమారం రేగుతోంది. 2021 సంవత్సరానికి గాను మొత్తం 119 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్రం. అయితే పద్మ అవార్డు గ్రహీతల్లో అత్యధికులు కేవలం 5 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సోం, పుదుచ్చేరిలకు అత్యధికంగా 34 పద్మ అవార్డులు దక్కాయి. తమిళనాడుకు 11 పద్మ అవార్డులు దక్కగా, అస్సోంకు 9, పశ్చిమ బెంగాల్ కు 7, కేరళా కోటాలో 6, పుదుచ్చేరి కోటాలో ఒక పద్మ అవార్డును కేంద్రం ప్రకటించింది. అంటే మొత్తం ప్రకటించిన పద్మాల్లో 29శాతం పద్మ అవార్డులు ఈ 5 రాష్ట్రాలకే దక్కాయన్న మాట. ఏప్రిల్ నుంచి మే మధ్యలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణమనే విమర్శలు వస్తున్నాయి. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు మరణానంతరం తమిళనాడు కోటాలో ప్రకటించారు. తమిళనాడులో తెలుగు ఓటర్లు భారీగా ఉన్నారు. అందుకే తెలుగు ఓటర్లను మచ్చిక చేసుకోవడం కోసమే ఆయనకు తమిళనాడు కోటాలో అవార్డు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. కేరళలోని వేనాడ్ నియోజకవర్గానికి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తుండగా వేనాడుకే చెందిన ధనంజయ్ దివాకర్ సగ్డో అనే వైద్యుడికి పద్మా అవార్డు దక్కింది. స్వామి వివేకానంద మెడికల్ మిషన్ ను నెలకొల్పి, దీని ద్వారా ట్రైబల్స్ కు 1980 నుంచి వైద్య సదుపాయాలు కల్పిస్తున్న డాక్టర్ ధనంజయ్ కి ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలున్నాయని చెబుతారు. ఢిల్లీకి చెందిన ఆర్కియాలజిస్టు బీ.బీ.లాల్కు ఈ ఏడాది పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. బాబ్రీ మసీదు వద్ద జరిపిన తవ్వకాల్లో దేవాలయానికి సంబంధించిన అవశేషాలు కనుగొన్నట్టు లాల్ 1992లో ప్రకటించారు. కాంగ్రెస్ హయాంలో మాత్రం ఈయనకు పద్మ అవార్డు దక్కలేదు. వామపక్ష సిద్ధాంతాలను అనుసరించేవారికే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించిందని అప్పట్లో బీజేపీ నేతలు విమర్శించారు. తాజాగా ఈయనకు పద్మ అవార్డు దక్కటంతో.. రైట్ వింగ్ సిద్ధాంతాలపై విశ్వాసమున్న లాల్కు పురస్కారం దక్కిందంటూ విమర్శలు మొదలయ్యాయి. పద్మ అవార్డుల ఎంపికలో రాజకీయ కోణాలు ఉండటం అనేది దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వాల విధానంగా మారుతోంది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకే ఈ పద్మ పురస్కారాలను ఎక్కువగా ప్రకటించటం వస్తోంది. ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన మోడీ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పద్మ అవార్డుల జాబితా తమను నిరాశకు గురిచేసిందని, ఎన్నికలున్న రాష్ట్రాలకే అగ్రతాంబూలం ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగింది. అయితే ఈ ఆరోపణలకు కేంద్రం ఖండించింది. ఐతే ఈ ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా అత్యధికంగా ఉండటంతో ఎక్కువ అవార్డులు దక్కాయని... విపక్షాలు దీన్ని రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నారంటూ కమలనాథులు కౌంటరిస్తున్నారు.
రేవంత్ టార్గెట్ గానే జగనన్న బాణం! కేసీఆర్, అమిత్ షా ఉమ్మడి వ్యూహం?
తెలంగాణలో కొత్త పార్టీ రాబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు సిద్దమవుతున్నారని, ఫిబ్రవరిలో ఆమె పార్టీ పెట్టడం ఖాయమని చెబుతున్నారు. అయితే తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై కొంత కాలంగా షర్మిల ఆగ్రహంగా ఉన్నారని... తన అన్నకు షాకిచ్చేందుకే ఆమె కొత్త పార్టీ పెట్టబోతుందని కొందరు చెబుతున్నారు. కాని వైఎస్ షర్మిల కొత్త పార్టీ వెనక సంచలన విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ను పూర్తిగా బలహీనపరిచే ఎత్తులో భాగంగానే షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా పీసీసీ రేసులో ముందున్న ఫైర్ బ్రాండ్ లీడర్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి టార్గెట్ గానే కొత్త పార్టీకి ప్లాన్ చేశారని తెలుస్తోంది. వైఎస్ షర్మిల పెడతారని చెబుతున్న పార్టీకి కర్త, కర్మ, క్రియ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరేనని, బీజేపీ అండదండలు కూడా ఉన్నాయని.. ఏపీ సీఎం జగన్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని విశ్వసనీయవర్గాల సమాచారం. తెలంగాణలో ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేసీఆర్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత భారీగా పెరిగింది. సీఎం సొంత గడ్డ సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సిట్టింగ్ సీటును కోల్పోవడం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ అనుకున్న ఫలితాలను సాధించలేకపోవడంతో ఇది రుజువైంది. వరుస ఓటములతో టీఆర్ఎస్ కేడర్ ఢీలా పడగా.. ఇదే అదనగా విపక్షాలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా ఎంపీ రేవంత్ రెడ్డి జనాల్లోకి దూసుకుపోతున్నారు. దీంతో రోజురోజుకు ఆయన గ్రాఫ్ పెరిగిపోతోంది. గత ఏడేండ్లుగా కేసీఆర్ కుటుంబంపై పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఆయన పోరాటానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రేవంత్ రెడ్డి ఇంకా బలపడితే తమకు మరిన్ని కష్టాలు తప్పవని టీఆర్ఎస్ పెద్దలు ఆందోళనగా ఉన్నారట. అందుకే రేవంత్ రెడ్డి బలం పెరగకుండా చూసేందుకే షర్మిలను రంగంలోకి దింపుతున్నారని చెబుతున్నారు. తెలంగాణలోని రెడ్డి సామాజికవర్గమంతా ఇప్పుడు అధికారం కోసం తహతహలాడుతోంది. వాళ్లందరికి రేవంత్ రెడ్డి ఆశాకిరణంలా మారిపోయారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలతో కొత్త పార్టీ పెట్టిస్తున్నారని తెలుస్తోంది. దివంగత వైఎస్సార్ కు తెలంగాణలో భారీగా అభిమానులున్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గంలో వైఎస్సార్ అంటే ఇప్పటికి క్రేజ్ ఉంది. షర్మిల పార్టీ పెడితే.. రెడ్డి సామాజిక వర్గం నుంచి కొత్త మద్దతు ఆమెకు లభిస్తుందని అంచనా. దీంతో రేవంత్ రెడ్డిని కొంత బలహీనం చేయవచ్చన్నది గులాబీ బాస్ వ్యూహమని చెబుతున్నారు. అందుకే తన మిత్రుడైన జగన్ తో మాట్లాడి.. అతని డైరెక్షన్ లోనే షర్మిల పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నారని, తెలంగాణలో రాబోయే కొత్త పార్టీకి ఫండింగ్ కూడా కేసీఆరే సమకూర్చనున్నారని సమాచారం. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో వైసీపీ గతంలో బలంగా ఉండేది. 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీతో పాటు మూడూ అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లోనూ షర్మిల పార్టీ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో 32 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. వీటిలోని చాలా నియోజకవర్గాల్లో ముస్లిం, క్రిస్టియన్, సీమాంధ్ర ఓటర్లు కీలకంగా ఉన్నారు. షర్మిల పార్టీ పెడితే .. ఈ వర్గ ఓట్లను ఆమె దక్కించుకునే అవకాశం ఉందంటున్నారు. షర్మిల పార్టీ ఎన్ని సీట్లు గెలిచినా తమకు ఇబ్బంది ఉండదని.. వచ్చే ఎన్నికల్లో తమకు మెజార్టీ తగ్గినా ఆ పార్టీ మద్దతు తీసుకోవచ్చనే యోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. అందుకే అన్ని పక్కాగా ఆలోచించాకే వైఎస్ షర్మిలను రంగంలోకి దించుతున్నారని చెబుతున్నారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీకి బీజేపీ పెద్దల సపోర్ట్ కూడా ఉందంటున్నారు. బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్. తెలంగాణలో తాము బలపడాలంటే హస్తం బలహీనపడాలని కమలం నేతలు కోరుకుంటున్నారు. దీంతో తమ ప్రత్యర్థి పార్టీ టార్గెట్ గానే కొత్త పార్టీ పెడుతున్నందున కమలనాధులు కూడా సై అన్నారని చెబుతున్నారు. ఏపీలో ఎలాగూ జగన్ తమ కనుసన్నల్లోనే ఉన్నారు కాబట్టి.. షర్మిల పార్టీ కూడా తమతోనే ఉంటుందని బీజేపీ నేతల ప్లాన్. అందుకే కాంగ్రెస్ ను ఖతం చేసే కేసీఆర్ వ్యూహంలో బీజేపీ కూడా భాగం పంచుకుందని, అందరూ కలిసి షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షా సమావేశంలో షర్మిల పార్టీపై కూడా చర్చించారని హస్తం నేతలు చెబుతున్నారు. మొత్తంగా మొదటి నుంచి తమకు కొరకరాని కొయ్యలా మారిన రేవంత్ రెడ్డికి బలం పెరగకుండా చూసేందుకే టీఆర్ఎస్, వైసీపీలు కలిసి ఈ కొత్త వ్యూహం పన్నాయని.. కాంగ్రెస్ బలహీనపడితే తమకు ప్రయోజనమేనన్న రాజకీయ కారణంతో కమలం పార్టీ కూడా వాళ్లకు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. ఎంపీ రేవంత్ రెడ్డి టార్గెట్ గా మూడు పార్టీల ఆపరేషన్ లో భాగంగానే వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని గాంధీభవన్ వర్గాలు నిర్దారణకు వచ్చాయంటున్నారు.
'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్.. అజయ్ దేవ్గణ్ అప్సెట్!
జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' రిలీజ్ డేట్ వచ్చేసిన విషయం తెలిసిందే. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ తేదీ.. అక్టోబర్ 13. దసరా కానుకగా ఆ సినిమాని రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. రాజమౌళి స్వయంగా రిలీజ్ డేట్ను తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. అయితే అక్టోబర్ 13న 'ఆర్ఆర్ఆర్'ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడం అనైతికమంటూ బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ఆరోపించడం గమనార్హం. అంతేకాదు, 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ను ఆ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన అజయ్ దేవ్గణ్ ట్విట్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఆయన హీరోగా బోనీ కపూర్ ప్రొడ్యూస్ చేస్తున్న 'మైదాన్' మూవీని అక్టోబర్ 15న విజయదశమి రోజున విడుదల చేస్తున్నట్లు ఆర్నెల్ల క్రితమే ప్రకటించారు. అందులో ఫుట్బాల్ కోచ్గా ప్రధాన పాత్రను దేవ్గణ్ పోషిస్తున్నాడు. దీంతో 'ఆర్ఆర్ఆర్'తో 'మైదాన్' పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజమౌళి సినిమా అంటే ఉండే క్రేజ్ వేరు కనుక 'మైదాన్' కలెక్షన్లకు 'ఆర్ఆర్ఆర్' గండికొడుతుందని బోనీ భయపడుతున్నారు. కాగా, 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసే ముందు ఓసారి బోనీని సంప్రదించమని రాజమౌళికి అజయ్ దేవ్గణ్ సూచించాడనీ, కానీ బోనీని సంప్రదించుకుండానే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారనీ తెలుస్తోంది. ఈ విషయాన్ని బోనీ స్వయంగా వెల్లడించారు. "ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయబోతున్నారని ఓ రోజు ముందు అజయ్కు తెలిసింది. అక్టోబర్ 15న మైదాన్ను రిలీజ్ చేస్తున్నట్లు నేనెప్పుడో అనౌన్స్ చేశాను కాబట్టి, ఆ సినిమా నిర్మాతలను నాతో మాట్లాడమని చెప్పినట్లు అజయ్ తెలిపారు. నాతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుకోమని వాళ్లకు సూచించారు. కానీ వాళ్లు నాతో మాట్లాడలేదు. అందుకే 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ను అజయ్ ట్వీట్ చేయడం కానీ, రిట్వీట్ చేయడం కానీ చేయలేదు" అని బోనీ చెప్పారు. అంతేకాదు, ఈ విషయం మాట్లాడేందుకు తాను దేవ్గణ్కు ఫోన్ చేసినట్లు బోనీ తెలిపారు. "తను షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల నా కాల్ను రిసీవ్ చేసుకోలేదు. తర్వాత కాల్ చేశారు. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ అనేది తన చేతుల్లో ఏమీ లేదనీ, అది ఆ సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి తీసుకున్న నిర్ణయమనీ చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే నిర్మాత ఆ డేట్ ఫిక్స్ చేశారని అజయ్ తెలిపారు" అని వెల్లడించారు బోనీ. 'ఆర్ఆర్ఆర్' మూవీలో ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా అజయ్ దేవ్గణ్ నటించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. రాజమౌళి మీద గౌరవంతో తాను ఉచితంగా నటించినా, ఇప్పుడు తన సినిమాపైనే 'ఆర్ఆర్ఆర్'ను పోటీకి దింపుతుండటం ఆయనకు బాధ కలిగించిందని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
స్నేహ కూతురి బర్త్డే.. కూతురితో మీనా సందడి!
తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న అందాల తార స్నేహ, సహ నటుడు తమిళుడైన ప్రసన్నను 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ దంపతుల ప్రేమానురాగాలకు చిహ్నంగా నాలుగేళ్ల క్రితం విహాన్ పుట్టాడు, గత ఏడాది జనవరి 24న కూతురు ఆద్యంత పుట్టింది. వివాహం స్నేహ కెరీర్ను అడ్డుకోలేదు. నిజానికి ప్రసన్న ఆమె కెరీర్ను కొనసాగించడానికి ప్రోత్సహిస్తూ వచ్చాడు. అందుకే పెళ్లయి, పిల్లలు పుట్టాక కూడా తనకు వస్తున్న అవకాశాలలో నచ్చినవి చేస్తూ వస్తున్నారు స్నేహ. అట్లా 'సన్నాఫ్ సత్యమూర్తి', 'వినయ విధేయ రామ' లాంటి సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించారు. అంతేకాదు, ఆద్యంత కడుపులో ఉండగా, 'పట్టాస్' మూవీలో ధనుష్ జోడీగా నటించడమే కాకుండా, ఆ సినిమాలో పాత్ర పోషణ కోసం మార్షల్ ఆర్ట్స్ను కూడా నేర్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. కాగా ఈ జనవరి 24న కూతురు ఆద్యంత ఫస్ట్ బర్త్డే వేడుకను స్నేహ, ప్రసన్న దంపతులు ఘనంగా జరిపారు. ఆద్యంత పింక్ గౌన్లో అదరగొట్టగా, స్నేహ ఎల్లో కలర్ గౌన్లో మెరిసిపోయారు. ఈ వేడుకకు నిన్నటి తరం హీరోయిన్ మీనా తన కూతురు నయనికతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు హీరోయిన్లు తమ కూతుళ్లతో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మీనా పింక్ కలర్ సల్వార్ కమీజ్లో, నయనిక రెడ్ కలర్ గౌన్లో మెరిశారు.
బన్నీ, విజయ్ దేవరకొండ.. ఓ మల్టిస్టారర్?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ మల్టిస్టారర్ రానుందా? అవునన్నదే ఫిల్మ్ నగర్ బజ్. ఆ వివరాల్లోకి వెళితే.. ఆనందో బ్రహ్మ, యాత్ర చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న మహి వి. రాఘవ్ రీసెంట్ గా ఓ మల్టిస్టారర్ సబ్జెక్ట్ తయారుచేసుకున్నారట. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు యూత్ లో మంచి క్రేజ్ ఉన్న కథానాయకులని ఇందులో నటింపజేసే ప్రయత్నం చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే.. తాజాగా బన్నీ, విజయ్ దేవరకొండతో మహి చర్చలు జరిపారని, ఇద్దరు కూడా ఆసక్తి చూపించారని టాక్. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరలో గానీ, వచ్చే ఏడాది ఆరంభంలోగానీ ఈ క్రేజీ మల్టిస్టారర్ పట్టాలెక్కే అవకాశముందంటున్నారు. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, ప్రస్తుతం బన్నీ యాక్షన్ థ్రిల్లర్ పుష్పతో బిజీగా ఉండగా.. విజయ్ స్పోర్ట్స్ డ్రామా లైగర్ చేస్తున్నారు. ఆపై కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ ఓ సోషల్ డ్రామా చేయనుండగా.. సుకుమార్ కాంబోలో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆయా చిత్రాలు ఓ కొలిక్కివచ్చాకే.. ఈ మల్టిస్టారర్ పట్టాలెక్కే అవకాశముంది.
వరుణ్ తేజ్ మీమ్ అప్డేట్.. 'ఆచార్య' టీజర్కు చరణ్ వాయిస్ ఓవర్?
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న 'ఆచార్య' టీజర్ రిలీజ్ డేట్ను ఈ రోజు ఉదయం డైరెక్టర్ కొరటాల శివ రివీల్ చేశాడు. జనవరి 9 సాయంత్రం 4:05 గంటలకు టీజర్ను రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. కొత్త సంవత్సరం, సంక్రాంతి, రిపబ్లిక్ డే లాంటి అకేషన్స్కు 'ఆచార్య' నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం వారిని తీవ్రంగా నిరుత్సాహ పరిచింది. ఇప్పుడు టీజర్ను 29న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో వాళ్లు సంబరపడుతున్నారు. కాగా ఆచార్యకు సంబంధించిన అప్డేట్స్ గురించి మెగాస్టార్ సహా మెగా హీరోలు మీమ్స్తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రచ్చరచ్చ చేస్తుండటం విశేషం. బుధవారం సాయంత్రం తనకూ, కొరటాలకూ మధ్య జరిగిన సంభాషణను మీమ్స్ రూపంలో చిరంజీవి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఆ మీమ్ స్టోరీని వైరల్ చేశారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'ఆచార్య' టీజర్కు సంబంధించిన మరో అప్డేట్ను మీమ్ రూపంలో షేర్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ మీమ్లో "చరణ్ అన్న వాయిస్ ఓవర్ అంటగా టీజర్కి" అని ఓ మీమ్కు, "ఆహా.. బయట టాకు" అని ఇంకో మీమ్కు క్యాప్షన్ పెట్టి షేర్ చేశాడు. గిరిబాబుతో బ్రహ్మానందం మాట్లాడుతున్న మీమ్ను దానికి వాడాడు. ఆ మీమ్కు #AcharyaTeaser అనే హ్యాష్ట్యాగ్ను జోడించాడు. తన పోస్ట్ను చిరంజీవి, చరణ్లకు ట్యాగ్ చేశాడు వరుణ్. దీంతో 'ఆచార్య' టీజర్కు రామ్చరణ్ నిజంగానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాడనే అభిప్రాయం ఫ్యాన్స్లో వ్యక్తమవుతోంది.
తన నవలను తనే తెరకెక్కించాడు!
సంజయ్ కర్లపూడి రాసిన నవల ద కర్స్డ్ కపుల్. ఇంగ్లీష్లో రాసిన ఆ నవల బాగానే పాఠకాదరణ పొందింది. ఆ నవలను స్వయంగా తెరకెక్కించాడు సంజయ్. ఆ సినిమా పేరు 'నువ్వుంటే నా జతగా'. శ్రీకాంత్ బిరోజు, గీతికా రతన్ జంటగా నటించారు. సాయి అక్షయ ప్రొడక్షన్స్, మ్యాన్కైండ్ మూవీస్ బ్యానర్లపై సుమ కర్లపూడి, రామకృష్ణ బలుసు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గురువారం ఉదయం 10:35 గంటలకు డైరెక్టర్లు బాబీ (కె.ఎస్. రవీంద్ర), వేణు ఊడుగుల 'నువ్వుంటే నా జతగా' ట్రైలర్ను విడుదల చేశారు. ఒక అందమైన ప్రేమకథతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ట్రైలర్ను చూస్తే అర్థమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి తనను ఇన్స్పైర్ చేసినట్లు ట్రైలర్ ఆరంభంలో దర్శకుడు తెలిపారు. ట్రైలర్ ప్రకారం 2007లో వారణాసిలో ఈ సినిమా కథ మొదలవుతుంది. రామ్ అనే అబ్బాయి, భూమి అనే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఆ పరిస్థితుల కారణంగా ఎలాంటి వేదనను అనుభవించారనేది ఈ చిత్రంలోని ప్రధానాంశం. ప్రేమ అనేది బాధతో పాటు, బలాన్నీ ఇస్తుందని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. "మాటివ్వు రామ్.. నన్నొదిలి ఎక్కడికీ వెళ్లనని" అని భూమి అడిగితే, "మాటిస్తున్నాను భూమి.. ఎలాంటి పరిస్థితుల్లోనూ నిన్నొదిలి వెళ్లను" అని రామ్ చెప్పాడు. కానీ రామ్.. తన మాట నిలబెట్టుకోలేకపోయాడని ట్రైలర్ తెలియజేస్తోంది. అలా ఎందుకు జరిగింది? ఆ ఇద్దరి మధ్యా దూరం ఎందుకు పెరిగింది? తిరిగి ఆ జంట ఒక్కటయ్యిందా, లేదా.. అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఆద్యంతం ఆసక్తికర కథనం, సన్నివేశాలతో సినిమా నడుస్తుందని ట్రైలర్ తెలియజేస్తోంది. హీరో హీరోయిన్లు కొత్తవాళ్లయినా దర్శకుడు వాళ్లతో మంచి నటన రాబట్టుకున్నారు. జ్ఞాని బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సుకుమార్ అల్లు సినిమాటోగ్రఫీతో ట్రైలర్ రిచ్ లుక్తో కనిపిస్తోంది. సినిమా కూడా అంతే రిచ్గా ఉంటుందని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా రిచ్ కంటెంట్తో, మంచి సాంకేతిక విలువలతో చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాతలు చెప్పారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన 'నువ్వుంటే నా జతగా' చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు
ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.
ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...
* దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో.... * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా.... * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు.. * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం .... జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు. రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి , ఇలా మాయమైపోయే జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్ ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు. ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు బీ జె పి, జన సేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి. ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం. ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ
సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.
కవిత, షర్మిలా రాజ్యసభకు వెళ్తారా?
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచనే ఎలా వుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? కవితా రాజ్యసభకు వెళ్తారా? అయితే హరిష్రావు ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్యకర్తల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు. రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్ఎస్ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్సరెడ్డి, మాజీీ స్పీకర్ కె.ఆర్.సురే్షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్సఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం. కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది. షర్మిల ఆపద సమయంలో జగన్కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట. కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.
అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?
రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి. అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.
రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!
అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!
అతను ఇంటర్నెట్ని ముందుగానే ఊహించాడు
‘మార్షల్ మెక్లుహాన్’ – ఈ పేరుని చాలామంది విని ఉండకపోవచ్చు. కానీ ‘గ్లోబల్ విలేజ్’ అన్న పదాన్ని వినే ఉంటారు కదా! ఆ మాటని మొదటిసారి ఉపయోగించిన వ్యక్తే మార్షల్ మెక్లుహాన్. అంతేకాదు... సాంకేతికతకు, మీడియాకు సంబంధించి ఆయన చేసిన అనేక ప్రతిపాదనలు సంచలనం సృష్టించాయి. సరిగ్గా 106 ఏళ్ల క్రితం మార్షల్ కెనడాలో పుట్టాడు. మంచి చదువు చదువుకుని ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు. అప్పుడే ప్రజలు నిదానంగా టీవీకి అలవాటుపడుతున్నారు. అదో అద్భుతం అనుకుని మురిసిపోతున్నారు. మీడియా అన్న పదం అప్పుడప్పుడే ప్రచారంలోకి వస్తోంది. ఆ సమయంలో మార్షల్ మీడియా గురించి ప్రత్యేకించి పుస్తకాలు రాయడం మొదలుపెట్టాడు. వాటిలో అనేక సిద్ధాంతాలు చేశాడు. మార్షల్ 1962లో The Gutenberg Galaxy అనే పుస్తకం రాశాడు. అందులో ఆయన మానవచరిత్రను నాలుగురకాలుగా విభజించాడు. * మొదటి దశ acoustic age- ఈ దశలో కేవలం వినికిడి ద్వారానే సమాచారం ఒకరి నుంచి ఒకరికి చేరుతుంది. * రెండో దశ literary age – ఈ దశలో నిదానంగా రాయడం అలవాటు అవుతుంది. ఆకుల మీదో, కాగితాల మీదో సమాచారాన్ని రాసుకుంటారు. * మూడో దశ print age – ఈ దశలో పుస్తకాలను ముద్రించడం సులువుగా మారిపోతుంది. కావల్సినంత సమాచారం పుస్తకాల రూపంలో దొరుకుతుంది. * నాలుగో దశ electronic age – ఈ దశంలో సమాచారం అంతా కూడా టీవీ, కంప్యూటర్ వంటి పరికరాల ద్వారానే ఒకరి నుంచి ఒకరికి చేరతాయి. మానవుడు మొదటి మూడు దశలనీ దాటేసి నాలుగో దశలోకి చేరిపోయాడనీ, ఇక మున్ముందు అంతా సమాచార విప్లవమే అని తేల్చి చెప్పేశాడు మార్షల్. అంతేకాదు! కంప్యూట్ అనే పరికరం కేవలం లెక్కలు చేయడానికే కాదునీ... పరిశోధనలు చేయడానికీ, ఒకరొకొకరు సమాచారం అందించుకోవడానికి సాయపడుతుందనీ ఊహించాడు. ఆ తర్వాత ఎప్పుడో 25 ఏళ్లకి కానీ జనాలకి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. దీన్ని బట్టి మార్షల్ ఊహ ఎంత ఖచ్చితమైనదో తెలిసిపోతుంది. మీడియాదే రాజ్యమనీ మున్ముందు ప్రతి విషయాన్నీ మీడియా తనదైన దృష్టిలో ప్రజలకు చేరవేస్తుందనీ ఆనాడే పసిగట్టారు మార్షల్. అందుకే ‘the medium is the message’ అన్న మాటని ఉపయోగించారు. ‘మీడియా ఎంత చెబితే అంత’ అన్న భావం ఇందులో స్ఫురిస్తుంది. మార్షల్ బతికున్నంతకాలమూ ఆయన మాటల్ని ఎవరూ పెద్దగా నమ్మలేదు. తరచూ టీవీలూ, మేధావులూ ఆయనను తల్చుకున్నా... ఆయన మాటలు నిజమవుతాయని ఎవరూ భావించలేదు. కానీ 1980లో మార్షల్ చనిపోయిన పదేళ్ల తర్వాత ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడం మొదలుపెట్టింది. ఇక ఆ తర్వాత జరిగినదంతా మనకి తెలిసిన చరిత్రే! ఏదన్నా పరిణామం జరిగిన తర్వాత దాని గురించి విశ్లేషించడం, అందులో మనం కూడా పాలుపంచుకోవాలని కోవడం సహజమే! కానీ భవిష్యత్తులో ఇలా జరగబోతోంది అని ముందుగానే ఊహించడం గొప్ప లక్షణం. అందుకే ఇవాళ గూగుల్ సైతం మార్షల్ని గౌరవించుకోవాలని అనుకుంది. ఆయన పేరుతో ఒక డూడుల్ని రూపొందించింది. - నిర్జర.
ఏ సందర్భంలో అయినా గడగడా మాట్లాడేసినంత మాత్రాన మనకి వాక్చాతుర్యం ఉందని మురిసిపోవడానికి లేదు. ఎవరి ముందైనా కూడా జంకు లేకుండా ఉపన్యాసం దంచేసినంత మాత్రాన మనం గొప్ప వక్తలం అనుకోవడానికీ లేదు. మనం చెప్పే మాట అవతలివారికి వినపడాలి. అది స్పష్టంగా అర్థమవ్వాలి. స్వరం కూడా వినసొంపుగా ఉండాలి. అప్పుడే మనం పలికే పదానికి ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఉత్త కంఠశోష మాత్రమే మిగులుతుంది. అందుకోసం కొన్ని చిట్కాలను పాటిస్తే తప్పక ఉపయోగం ఉంటుందంటున్నారు నిపుణులు. సరైన శ్వాస: ఆరోగ్యంగా ఉండాలంటే గాఢంగా ఊపిరి పీల్చుకోవాలని అందరూ చెప్పే విషయమే! ఇలా ఊపిరితిత్తుల లోతుల నుంచి ఊపిరి పీల్చుకునే అలవాటు వల్ల మన మాటలో కూడా మార్పు వస్తుంది. మాటని బలంగా చెప్పగలుగుతాం. కావాలంటే గట్టిగా ఊపిరి తీసుకుని మాట్లాడి చూడండి... మీ మాటల్లోని మార్పు మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. నిదానంగా: భయంతోనో, మనసులో మాటని త్వరత్వరగా చెప్పాలన్న ఉద్విగ్నతతోనో మనం హడావుడిగా మాట్లాడతాం. భాష మీద పట్టుంటే త్వరగా మాట్లాడగటం అన్న అపోహ కూడా చాలా మంది ఉంది. అందుకనే భారతీయులు ఆంగ్లంలో మాట్లాడేటప్పుడు హడావుడిగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. దీని వల్ల అసలుకే ఎసరు తప్పదు. తప్పులుతడకలుగా మాట్లాడటమో, తడబడటమో, మన మాట అవతలివారికి అర్థం కాకపోవడమో జరుగుతుంది. ఉపన్యాస కళ మీద మంచి పట్టు ఏర్పడే వరకు కాస్త ఆలోచించి నిదానంగా మాట్లాడటమే మంచిది. రికార్డు చేసుకుని: ఎవరి మాటలు వారి చెవులకు అద్భుతంగానే తోస్తాయి. కానీ మన మాటలు అవతలివారికి ఎలా వినిపిస్తుందో గ్రహించం. అందుకోసం ఒక్కసారి మన మాటల్ని మనమే రికార్డు చేసుకుని వింటే మన శ్రావ్యమైన గొంతు మీద మనకి ఉన్న నమ్మకాలన్నీ పటాపంచలైపోతాయి. దాంతో ఎలాగైనా సరే మనం మాట్లాడే తీరుని మార్చుకోవాలన్న పట్టుదల ఏర్పడుతుంది. గొంతు తెరచి: చాలామంది మాట్లాడుతుంటే ఊరికనే పెదాలని ఆడిస్తున్నట్లు కనిపిస్తుందే కానీ స్పష్టత ఉండదు. నోరు పూర్తిగా తెరిచి మాట్లాడకపోతే మన మాటలు గొణుగుతున్నట్లుగానే వినిపిస్తాయి. నోరు పూర్తిగా తెరుకుని మాట్లాడినప్పుడు పెదాలు కూడా విచ్చుకుంటాయి. నాలుకా, కింద దవడలు కూడా కదులుతూ ఉన్నప్పుడు పదాలను స్పష్టంగా, దృఢంగా పలకగలుగుతాం. వ్యాయామం: సంగీత స్వరాల మీద పట్టు సాధించేందుకు మన పెద్దలు చన్నీళ్లలో గొంతు వరకూ మునిగి సాధన చేసేవారట. అంత కష్టం మనవల్ల కాదు కానీ స్వరం మెరుగుపడేందుకు చాలా వ్యాయామాలే ఉన్నాయి. ఉదాహరణకు Cicely Berry వ్యాయామం పేరుతో ఇంటర్నెట్లో శోధిస్తే కొన్ని పదాలు కనిపిస్తాయి. వీటిని కనుక పలుకుతూ ఉంటే మన ఉచ్ఛారణ మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే సంస్కృత శ్లోకాలని చదవడం, Tongue twistersని అభ్యసించడం వల్ల కూడా ఉచ్ఛారణ మెరుగుపడుతుందని చెబుతారు. - నిర్జర.
ఫేస్బుక్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న కథ ఇది... కొందరు శాస్త్రవేత్తలు ఐదు కోతులను ఒకే గదిలో పెట్టారట. ఆ గది మధ్యలో ఓ పెద్ద బల్లని ఉంచారు శాస్త్రవేత్తలు. ఆ బల్ల మీద వాళ్లు రోజూ ఒక తాజా అరటిపండుని ఉంచేవారట. గదిలో ఉన్న కోతుల్లో ఒకటి ఆ అరటిపండు కోసం బల్ల ఎక్కేందుకు ప్రయత్నించగానే... కింద ఉన్న మిగతా కోతుల మీద చల్లటి నీళ్లను కుమ్మరించేవారు శాస్త్రవేత్తలు. అంటే అరటిపండు కోసం పైకి వెళ్లే కోతి వల్ల కింద ఉన్న కోతులకి శిక్షపడేదన్నమాట. దాంతో కొన్నాళ్లకి ఆ కోతులు పైకి ఎక్కేందుకు సాహసించడం మానేశాయి. ఒకవేళ ఏదన్నా కోతికి నోరూరి బల్లని ఎక్కేందుకు ప్రయత్నించగానే, మిగతా కోతులన్నీ కలిసి దాన్ని లాగిపారేసేవి. కొద్ది రోజుల తరువాత ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలు ఓ చిన్న మార్పుని తీసుకువచ్చారు. ఆ అయిదు కోతుల్లో ఒకదాన్ని బయటకు తీసుకువెళ్లిపోయి, దాని స్థానంలో ఒక కొత్త కోతిని ప్రవేశపెట్టారు. ఈ కొత్త కోతి అరటిపండుని చూడగానే గభాలున బల్లని ఎక్కేందుకు సిద్ధపడిపోయింది. కానీ వెంటనే ప్రమాదాన్ని గ్రహించిన మిగతా కోతులు, దాన్ని దబదబా కిందకి లాగేశాయి. ఇలా రెండు మూడుసార్లు తన్నులు తిన్న తరువాత, కొత్త కోతి కూడా మిగతా కోతులలాగానే నిమ్మళంగా ఉండిపోయిది. ఒకో వారం గడుస్తున్న కొద్దీ శాస్త్రవేత్తలు ఒకో పాత కోతికి బదులుగా మరో కొత్త కోతిని గదిలో ఉంచసాగారు. కొంతకాలం గడిచేసరికి కొత్త కోతులు అక్కడి వాతావరణానికి, మిగతా కోతుల స్వభావానికి అలవాటుపడిపోయాయి, తాము కూడా అందుకు అనుగుణంగానే ప్రవర్తించడం నేర్చుకునేవి. కొన్నాళ్లకి ఆ గదిలో పాత కోతులేవీ లేకుండా పోయాయి. కొత్త కోతులకి చన్నీళ్లతో విధించే శిక్ష అసలేమాత్రం అనుభవం లేదు. అయినా కూడా ఎప్పుడన్నా ఓ కోతి ఆదమరచి అరటిపండు కోసం బల్ల దగ్గరకు చేరుకోగానే, మిగతా కోతులన్నీ కలిసి దాన్ని కరిచి పారేయడం మానలేదు!!! కొందరు మనుషులు కూడా బహుశా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారేమో! ఒక పనిని తాము ఎందుకు చేస్తున్నామో చాలా మంది ఆలోచించరు. దాని వల్ల తనకు ఎలాగూ నష్టం కలుగుతుంది. ఇతరులకు కూడా తన చర్య వల్ల నష్టం కలుగుతున్నా, వీళ్లు తమ తీరుని మార్చుకోరు. ఒక్కసారి మన మొండివైఖరిని పక్కకి పెట్టి విచక్షణకు పదును పెడితే, జీవితంలో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఈ కథ చెబుతోంది. ఆ పరిష్కారం వల్ల మనం ముందుకు సాగడమే కాదు, ఇతరులను కూడా విజయం వైపుగా నడిపించేందుకు దోహదపడిన వారమవుతాం. లేకపోతే... ..Nirjara
మోడీ, షాలు ఇక బలవంతులు కాదు.. బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్
ఢిల్లీలో రైతులు, పోలీసుల మధ్య నిన్న తలెత్తిన ఘర్షణలపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ జాతీయ నేతలు ఇకనైనా మేలుకోవాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఈరోజు ట్విటర్లో వరుసగా పోస్టులు పెట్టారు. నిన్న ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ పరేడ్తో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై ఉన్న ‘‘బలవంతులు’’ అనే ముద్రకు నష్టం వాటిల్లిందని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. "ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆందోళన కారణంగా ప్రధానంగా ఇద్దరు భాగస్వాముల గౌరవం దెబ్బతిన్నది. ఒకటి, పంజాబ్ కాంగ్రెస్, అకాలీదళ్ నేతలు, వారి మధ్యవర్తులు కాగా... రెండోది, మోదీ- షా ‘‘బలవంతులు’’ అనే ముద్ర. అయితే ఈ ఘటనతో భయపడింది ఎవరు అంటే.. నక్సలైట్లు, డ్రగ్స్ ముఠాలు, ఐఎస్ఐ, ఖలిస్తానీలు. దయచేసి ఇకనైనా బీజేపీ మేలుకోవాలి..’’ అని స్వామి ఆ ట్వీట్ లో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఢిల్లీలో శాంతి భద్రతల "వైఫల్యం" పైనా స్వామి విమర్శలు సంధించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను నిలిపివేయాలని తాను ముందుగానే కేంద్రాన్ని అనేక మార్లు కోరానని ఆయన గుర్తుచేశారు. "భారత్ను మరింత బలహీనం చేసేందుకు ఈ మార్చి- మేలో చైనా భారీ దాడి చేయవచ్చు. హిందువులను ముట్టడి వేశారు జాగ్రత్త.. ఇకనైనా మేలుకొండి.." అని ఆయన హెచ్చరించారు. రైతుల ఆందోళన కారణంగా ఈ ఏడాది గణతంత్ర వేడుకలు రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు... ట్రాక్టర్ పరేడ్ పేరుతో తాజాగా ఢిల్లీ నగర వీధుల్లోకి దూసుకెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మదనపల్లె అక్కాచెల్లెళ్ల డెత్ మిస్టరీ.. కుక్కపై అలేఖ్య పునర్జన్మ ప్రయోగాలు!!
చిత్తూరు జిల్లా మదనపల్లెలో అక్కాచెల్లెళ్ల హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మూఢ నమ్మకాల మాయలో పడి కన్న తల్లిదండ్రులే వారి ఇద్దరి కూతుళ్ళని కడతేర్చారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే, అక్కాచెల్లెళ్ల హత్య వెనుక కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో తమ కూతుళ్లు మరణించలేదని, మళ్ళీ తిరిగి వస్తారని తల్లి పద్మజ విచిత్ర వాదన చేయగా.. తండ్రి పురుషోత్తమ నాయుడు మాత్రం హత్యలకు దారితీసిన కారణాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. పెద్ద కూతురు అలేఖ్య చెప్పిన మాటలు నమ్మి, పునర్జన్మలను విశ్వసించి ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. మదనపల్లెలో అక్కాచెల్లెళ్ల హత్యకు ప్రధాన కారణం పెద్ద కుమార్తె అలేఖ్యనే అని తెలుస్తోంది. అలేఖ్యకు పునర్జన్మలపై నమ్మకం ఉంది. పునర్జన్మల గురించి వివిధ పుస్తకాలు, వివిధ వీడియోలు చూసి చాలా విషయాలు తెలుసుకుంది. పునర్జన్మ సాధ్యమనే నమ్మకం ఆమెలో కలిగింది. ఆ నమ్మకాన్నే ఆమె తన తల్లిదండ్రుల్లో కలిగేలా చేసింది. తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కపై పునర్జన్మ ప్రయోగం చేసానని.. కుక్కని చంపి మళ్ళీ బ్రతికించానని చెప్పింది. ఆమె మాటలను తల్లిదండ్రులు విశ్వసించారు. అంతేకాదు, చిన్నకుమార్తె సాయి దివ్యపై పునర్జన్మ ప్రయోగాలు చేయడానికి అంగీకరించారు. అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. పునర్జన్మ పేరుతో సాయి దివ్యను చంపేశారు. అయితే ఆమె తిరిగి బ్రతకకపోవడంతో.. అలేఖ్య తనని చంపమని కోరింది. ఇద్దరం కలిసి మళ్ళీ జన్మిస్తామని చెప్పింది. పునర్జన్మ మాయలో పడిపోయిన తల్లి.. అలేఖ్యను కూడా చంపేసింది. ఇలా పునర్జన్మ ప్రయోగాల పేరుతో కన్న తల్లే ఇద్దరు కూతుళ్ళని పొట్టన పెట్టుకుంది. ఈ విషయాన్ని తండ్రి పురుషోత్తమ నాయుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది.
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో జనసేనకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉండనుందని తెలిపారు. బుధవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో చిరంజీవి తోడు ఉంటారని అన్నారు. పవన్ మళ్లీ సినిమాలు చేయడానికి చిరంజీవి కారణమని తెలిపారు. ఓ రెండు మూడేళ్లు సినిమాలు చేయాలని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలు చేసుకోవాలని పవన్ కు చిరంజీవి సూచించారని.. ఆయన సూచన మేరకే పవన్ సినిమాలు చేస్తున్నారన్నారు. పవన్ తో కలిసి నడిచేందుకు తాను సిద్ధమేనన్న సానుకూల సంకేతాలను చిరంజీవి ఇచ్చారని తెలిపారు. పవన్ రాజకీయ ప్రస్థానంలో తాను కూడా అండగా నిలుస్తానని చిరంజీవి హామీ ఇచ్చారన్నారు. నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలతో జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఖాయమని జనసేన కార్యకర్తలు అంటున్నారు. కాగా, గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి.. కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాతర్వాత క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. అయితే తాజాగా నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీని బలపరిచేవిగా ఉన్నాయి.
బాదం పప్పు రుచికరంగా ఉండడమే కాదు.. ఎంత శక్తివంతమో తెలుసుకుందాం. బిపి, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నవారికి పీచుపదర్ధాన్ని అందిస్తుంది. బాదం పప్పు వల్ల పోషక విలువలు మరెన్నో లాభాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు. ఒక ఔన్స్ బాదం పప్పులో 165 క్యాలరీలు, 6 గ్రాముల కార్బో హైద్రేట్స్, 35 గ్రాముల పీచుపదార్ధాలు ఉంటాయి. కొవ్వువల్ల వచ్చే హృద్రోగ సమస్యలనుండి నివారించేది బాదం పప్పుమాత్రమే అంటే అతిశయోక్తి కాదు. కొలెస్ట్రాల్ నియంత్రించడంలో బాదం కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. 1/3 వంతు కప్పు బాదం పప్పు రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. బాదం పప్పులో కాల్షియం లభిస్తుంది. దీనివల్ల బాదం శరీరంలోని ఎముకల నిర్మాణానికి దోహదం చేస్తుంది. రక్తనాళాలలో రక్తం గడ్డ కడితే బాదం దీనిని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన కండరాలు, బలమైన గుండెకు దోహదం చేసేది బాదం పప్పే. మీకు ఒకవేళ ఎలర్జీ ఉంటే అంటే ముఖ్యంగా పాలుత్పత్తులు ఇతర పదార్ధాలవల్ల ఎలర్జీ ఉంటే వీటి స్థానంలో ఆవుపాలకు బదులు బాదం పాలు వాడవచ్చు. ఈ పాలలో లాక్టోసీస్, కొలెస్ట్రాల్ లేకుండా ఉంటాయి. ఆహారంలో పీచుపదార్ధం అత్యవసరం. మీ రక్తంలో చక్కర నిల్వను తగ్గిస్తుంది. హృద్రోగ సమస్యకు చెక్ పెట్టేది బాదం మాత్రమే. 23 బాదం పప్పులకు 25 గ్రాముల పీచుపదార్ధం లభిస్తుంది. శరీరంలో వచ్చే ముడతలను నివారిస్తుంది. మెటబాలిజం ను వృద్ధి చేస్తుంది. అందరు ఎదుర్కొంటున్న అధిక బరువు నుంచి బయటపడేందుకు బాదం ఉపయోగ పడుతుంది. సెలోటోనియం లెవెల్ ను నియంత్రిస్తూ నిద్రను నియంత్రించడంలో బాదం కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల పగలు మేల్కొని రాత్రి సుఖంగా నిద్రపోవచ్చని నిపుణులు వెల్లడించారు. అరకప్పుబాదం తీసుకోవడంవల్ల శరీరం లోని ఆర్గాన్లు మెరుగు పడతాయని సెక్స్ జీవితం సంతృప్తికరంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. బాదం పప్పులు విటమిన్ ఇ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. శరీరంలో కణాలు నాశనం కాకుండా కాపాడుతాయి. విటమిన్ ఇ ఎక్కువగా తీసుకుంటే హృద్రోగ సమస్యలు ఆల్జీమర్స్ , క్యాన్సర్ ను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. ల్యాక్టో బేసిలెస్ వల్ల ఆహారం జీర్ణం అయ్యేందుకు సహాకరిస్తుంది. ఇన్ఫెక్షన్ ల నివారణకు అవసరమైన రసాయనాలు బాదం అందిస్తుంది.
Food Check Drink Diet Crunching calories? Here are three drinks that will help you burn fat faster... Vegetable Juices Whether you juice them alone or combine them with fruits, Veggies like cabbage, broccoli and cauliflower are efficient fat-fighting weapons. Rich in phytonutrients, these juices help reduce the overall amount of body fat, reduce inflammation, control blood sugar levels and help balance hormones. Green Tea A cup of green tea a day will help drive the fat away. Green tea is packed with antioxidants that boost metabolism, as well as increase energy levels and suppress the appetite. Black coffee Black coffee, when consumed in moderation, has abundant health benefits. It contains antioxidants that help reduce the risk for certain types of cancer. Also the caffeine in coffee boosts metabolism and helps you burn calories faster. But remember, milk and sugar are big no-no’s. Fitness Check Fit Facts Quick facts to be kept in mind when planning your fitness regime... No matter how old you are or how poor your current level of fitness may be, there’s nothing stopping you from starting an exercise routine to get healthy and fit. Start as small regimes. For example, start with 20 minutes of exercise and then boost up the time period, as you go. This way, you won’t burn yourself out before you even get started. Simply adding movement into your daily routine can increase your level of fitness. Whether it’s taking the stairs or walking your dog, everything counts.Jogging is a great way to burn the calories and its good for the bones too. However, it might be too strenuous for some. But no worry, as walking at a brisk pace burns almost as many calories as jogging the same distance. Walking through water or against the wind burns approximately, 50 more calories an hour. Switch things up, if you’ve been walking for a month, try running or cycling next. Gradually increase the durations and types of workouts, This keeps your workout fun and your mind motivated. Take care, Stay Healthy!!!! -Sandya Koya
పౌష్టికాహార లోపం.. దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారణం