ఏపీలో ఏం జరగబోతోంది? రాజ్యాంగ సంక్షోభం తప్పదా?
Publish Date:Jan 11, 2021
ముఖ్యమంత్రి సీటుపై పంచాయితి! కుటుంబ సభ్యులతో కేసీఆర్ కు తలనొప్పి?
Publish Date:Jan 9, 2021
50 వేల కోట్ల విలువైన భూ వివాదానికి 80 ఏండ్ల చరిత్ర!
Publish Date:Jan 8, 2021
బూతు పదాలే పదవులకు సోపానం! తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పతనం?
Publish Date:Jan 7, 2021
బేసిన్ బయట కృష్ణా రివర్ బోర్డు! తుగ్లక్ ను మించిపోయారంటూ సెటైర్లు!
Publish Date:Jan 5, 2021
తిరుపతి కింగ్ టీడీపీనే.. తేల్చేసిన ప్రీ పోల్ లెక్కలు!!
Publish Date:Jan 4, 2021
చంద్రబాబు రామతీర్థం అందుకే వెళ్లారా ? ఏపీలో అసలేం జరుగుతోంది ?
Publish Date:Jan 2, 2021
మితృత్వం లాంటి శతృత్వం.. బీజేపీ వైసీపీల పొలిటికల్ గేమ్ లో టీడీపీ బలి కానుందా?
Publish Date:Dec 31, 2020
గంటల్లో రూ. 2 వందల కోట్లు హాంఫట్! అధికార పార్టీ ముఖ్య నేత డీల్?
Publish Date:Dec 18, 2020
ఓడిన కార్పొరేటర్ల వసూళ్ల పర్వం! గ్రేటర్ లో కొత్త పంచాయితీ
Publish Date:Dec 17, 2020
జోన్లు తేలకుండా, టెట్ లేకుండా భర్తీ ఎలా? ఓట్ల కోసం కేసీఆర్ మరో మోసమా?
Publish Date:Dec 14, 2020
పీసీసీ ఎంపికలో చేతులెత్తేసిన ఠాగూర్! పార్టీ సీనియర్ల తీరుపై కేడర్ ఫైర్
Publish Date:Dec 12, 2020
అప్పుల కోసం లిక్కర్ సేల్స్ హైక్! జగన్ సర్కార్ పై జనాల ఫైర్
Publish Date:Dec 11, 2020
బీజేపీతో సయోధ్యా.. సమరమా! ఆసక్తిగా మారిన కేసీఆర్ ఢిల్లీ టూర్
Publish Date:Dec 10, 2020
కారు, కాంగ్రెస్ పార్టీలు కలిసి పయనిస్తాయా? తెలంగాణ రాజకీయాల దారెటు ?
Publish Date:Dec 9, 2020
గులాబీకి గుచ్చుకున్న ముళ్లు!
Publish Date:Dec 5, 2020
కూకట్ పల్లిలో వికసించని కమలం! సోము వీర్రాజేనా కారణం?
Publish Date:Dec 4, 2020
శివారులో బీజేపీ జోష్! గులాబీలో పెరిగిన టెన్షన్?
Publish Date:Dec 2, 2020
‘గ్రేటర్ గులాబీ’తోటలో ‘కమలం’ వికసిస్తుందా?
Publish Date:Dec 1, 2020
తల్వార్తో కేక్ కట్ చేసి.. క్షమించమని వేడుకున్న స్టార్ యాక్టర్!
విజయ్ టైటిల్ రోల్ చేసిన 'మాస్టర్' మూవీలో విలన్ భవానీ పాత్రలో గొప్పగా రాణించి, అందరి ప్రశంసలూ అందుకుంటున్న విజయ్ సేతుపతి తాజాగా అందరికీ క్షమాపణలు చెప్పాడు. కారణమేంటో తెలుసా? బర్త్డే వేడుకలో కేక్ను పెద్ద తల్వార్తో కట్ చేసినందుకు! జనవరి 16 ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తమిళంలో షేర్ చేసిన ఒక సుదీర్ఘమైన లేఖలో, తానొక బ్యాడ్ ఎగ్జాంపుల్ను సెట్ చేశాననీ, కానీ ఫ్యూచర్లో జాగ్రత్తగా ఉంటాననీ ప్రామిస్ చేశాడు. పొన్రామ్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా సెట్స్పై మూడు రోజుల ముందుగానే అతను తన బర్త్డే వేడుకను జరుపుకున్నాడు. యూనిట్ మెంబర్స్ అతని కోసం ఓ బర్త్డే కేక్ను తీసుకొచ్చారు. దానికి ఓ పెద్ద కత్తితో కట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దాంతో పాటు కాంట్రవర్సీని కూడా సృష్టించింది. పెద్ద తల్వార్తో కేక్ కట్ చేసి, యువతకు, అభిమానులకు ఏం సందేశమిస్తున్నారంటూ పలువురు ప్రశ్నించారు. దీంతో తన పొరపాటు గ్రహించిన విజయ్ సేతుపతి తన చర్యకు క్షమించమని కోరాడు. "నా బర్త్డే సందర్భంగా విష్ చేసిన సినిమా వ్యక్తులకూ, అభిమానులకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నా. మూడు రోజుల క్రితం నా బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా తీసిన ఫొటో ఇప్పుడు కాంట్రవర్సీ అయ్యింది. ఆ ఫొటోలో ఓ పెద్దకత్తితో నా బర్త్డే కేక్ను కట్ చేస్తున్నాను. నేను డైరెక్టర్ పొన్రామ్ సినిమాలో నటిస్తున్నా. ఆ మూవీలో ఆ కత్తి చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. పొన్రామ్, ఆయన టీమ్తో నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం వల్ల, నా కేక్ను కట్ చేయడానికి ఆ కత్తిని ఉపయోగించాను. ఇది ఒక చెడు ఉదాహరణగా చాలామంది ఆక్షేపించారు. ఇప్పట్నుంచీ, నేను జాగ్రత్తగా ఉంటాను. ఎవరినైనా నేను హర్ట్ చేసినట్లయితే, వారికి క్షమాపణలు చెప్తున్నా, నా చర్యకు చింతిస్తున్నాను." అని ఆ లేఖలో తెలియజేశాడు విజయ్ సేతుపతి. ఈమధ్యే శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్లో నటించేందుకు సిద్ధపడి, తమిళుల నుంచి వచ్చిన నిరసనలతో వెనక్కి తగ్గిన విజయ్ సేతుపతి, అప్పుడు కూడా తనను క్షమించమని కోరిన విషయం తెలిసిందే.
ఈమె మహేశ్ హీరోయిన్.. గుర్తు పడతారా?
పూరి జగన్నాథ్ డిస్కవరీగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఓ తార. మొదట కన్నడంలో పునీత్ రాజ్కుమార్ సరసన 'అప్పు' మూవీలో, తర్వాత అదే సినిమా తెలుగు రీమేక్ 'ఇడియట్'లో హీరోయిన్గా నటించి, రెండు భాషల్లోనూ తెరంగేట్రం సినిమాతో సెన్సేషనల్ హీరోయిన్గా మారిందామె. ఆమె.. రక్షిత. 'ఇడియట్' తర్వాత మహేశ్ సరసన 'నిజం', వేణు జోడీగా 'పెళ్లాం ఊరెళితే', జూనియర్ ఎన్టీఆర్తో 'ఆంధ్రావాలా' సినిమాల్లో నటించిన ఆమె 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ను వివాహం చేసుకొని, సినిమాలకు దూరమైంది. హీరోయిన్గా తన అందచందాలు, హుషారైన నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న రక్షిత, వివాహమైన నాలుగేళ్లకు ప్రొడ్యూసర్గా మారి ఇప్పటికే మూడు సినిమాలు నిర్మించి, ప్రస్తుతం నాలుగో సినిమాని నిర్మిస్తోంది. నటిగా ఉన్నంత కాలం తన రూప లావణ్యాలను చక్కగా మెయిన్టైన్ చేస్తూ వచ్చిన ఆమె, ప్రస్తుతం బాగా బరువు పెరిగిపోయింది. ముఖం కూడా చాలా మారిపోయింది. అప్పటి 'ఇడియట్' హీరోయిన్ ఈమేనంటే తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టలేనంతగా మారిపోయిందనేది నిజం. ఈ ఏడాది సంక్రాంతిని ఆమె తన కుటుంబంతో తమ ఫామ్హౌస్లో గడిపింది. అక్కడి గోవులు, వాటి పిల్లలతో ఆడుతూ గడిపింది. దీనికి సంబంధించిన పలు పిక్చర్స్ను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది రక్షిత. "Namma Sankranthi habba ..... this was the most fun I have had in ages ..... hope u guys have had a super day too .... happy happy Sankranthi to everyone." అంటూ వాటికి క్యాప్షన్ జోడించింది. ఆవు దూడలతో ఆమె ఆడుతున్న ఫొటోలు ఇప్పుడు ఆన్లైన్లో వైరల్గా మారాయి.
మంచు ఈవెంట్.. మహేశ్ స్పెషల్ ఎట్రాక్షన్!
మంచు విష్ణు భార్య విరానికా బర్త్డే జనవరి 15. ఈ సందర్భంగా విష్ణు ఇచ్చిన పార్టీకి మహేశ్, నమ్రత దంపతులు హాజరయ్యారు. దీంతో ఆ పార్టీకి స్పెషల్ ఎట్రాక్షన్ వచ్చినట్లయింది. వారితో పాటు హీరో గోపీచంద్ కూడా ఈ పార్టీకి వచ్చాడు. విష్ణు, గోపి మంచి ఫ్రెండ్స్. తన భార్య బర్త్డేని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి విష్ణు పార్టీ ఇచ్చాడు. దీనికి మహేశ్ దంపతులతో పాటు, గోపీచంద్నూ ఆహ్వానించాడు. విష్ణు ఆహ్వానం మేరకు భార్య నమ్రతతో కలిసి ఆ బర్త్డే పార్టీకి అటెంటయ్యాడు మహేశ్. ఆ దంపతుల రాకతో విష్ణు దంపతులు ఖుషీ అయ్యారు. విష్ణు ఎంత సంబరపడ్డాడంటే.. మహేశ్ కపుల్తో తమ కపుల్ తీయించుకున్న ఫొటోను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేశాడు. దాంతో పాటు, "ఈ ఫొటోలోని ఒక వ్యక్తి రోజు రోజుకీ యువకుడిగా ఎదుగుతూ, మరింత ఆందంగా కనిపిస్తున్నాడు. ఇది అతని మంచి గుణం, దయార్ద్ర హృదయంతోనే అని నేను బలంగా నమ్ముతున్నాను." అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్కు వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటు మహేశ్ ఫ్యాన్స్, అటు విష్ణు ఫ్యాన్స్ ఈ పోస్ట్కు ఖుషీ అవుతున్నారు. ఈ ఫొటోలో మహేశ్, నమ్రత ఇద్దరూ క్యాజువల్ లుక్స్లో ఆకట్టుకుంటున్నారు. మహేశ్ బ్లాక్ కలర్ నెక్ టీ షర్ట్, లైట్ బ్యూ జీన్స్ ధరించగా, విష్ణు బ్లాక్ కలర్ టీ షర్ట్, ప్యాంట్ ధరించాడు.
నమిత పొంగల్ ముగ్గులు వైరల్!
తక్కువ సినిమాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకొనే తారలు కొద్దిమందే ఉంటారు. వారిని ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోరు. అలాంటి తారల్లో నమిత ఒకరు. ఆమె వేళ్లమీద లెక్కించదగ్గ సినిమాల్లోనే నటించింది. ప్రస్తుతం ఆమెకు తెలుగులో అవకాశాలు కూడా లేవు. అయినా నమిత వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవల ప్రభాస్తో ఆమె పేరు కలిసి సోషల్ మీడియాలో విరివిగా కనిపించింది. 'బిల్లా' సినిమాలో చేసే టైమ్లో ఆ ఇద్దరి మధ్యా బంధం పెనవేసుకుందంటూ వదంతులు షికార్లు చేశాయి. అయితే వాటిని నమిత ఖండించారు. తన ఫిగర్తోటే నమిత చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. మధ్యలో బాగా బరువు పెరగడం వల్ల హీరోయిన్ చాన్సులు తగ్గిపోయాయి. ఆ తర్వాత తమిళ్ బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరచారు. ఆ షో నుంచి బయటకు వచ్చాక తన బాయ్ఫ్రెండ్ వీరేంద్రను 2017లో ఆమె పెళ్లాడారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె, ప్రస్తుతం తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆమె స్టార్ కాంపైనర్. కాగా సంక్రాంతి పండుగను ఆమె తన కుటుంబంతో జాలీగా జరుపుకున్నారు. తమ ఇంటి ముందు స్వయంగా ముగ్గులు వేసి, వాటికి రంగులద్దారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఏమైనా నమిత గ్లామరే వేరు!
పాండ్యా బ్రదర్స్ తండ్రి మృతి!
ఇవాళ ఇండియన్ క్రికెట్లో హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా సోదరులు తమదైన ముద్రవేస్తూ ముందుకు పోతున్నారు. ముఖ్యంగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగుతున్న ఈ బ్రదర్స్ ఆ జట్టు నాలుగు సార్లు చాంపియన్ కావడంలో తమ వంతు పాత్రను సమర్థంగా పోషిస్తున్నారు. కాగా, వారి తండ్రి హిమాన్షు పాండే గుండె పోటుతో నేడు (జనవరి 16) మృతి చెందారు. దాంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కొడుకుల కోసం హిమాన్షు తన వ్యాపారాన్ని సైతం త్యాగం చేశారు. ఈ రోజు హార్దిక్, క్రునాల్ క్రికెట్లో కెరీర్ను ఆస్వాదిస్తున్నారంటే అది తండ్రి పడిన కష్టం ఫలితమే. ఈ విషయం ఆ బ్రదర్స్ పలు సందర్భాల్లో తెలియజేశారు కూడా. సూరత్లో ఓ చిన్నపాటి కార్ ఫైనాన్స్ బిజినెస్ నడుపుతుండే హిమాన్షు, కొడుకుల కెరీర్ కోసం దాన్ని మూసేసి, అక్కడి కంటే మంచి క్రికెట్ ట్రైనింగ్ సౌకర్యాలు ఉన్న వడోదరకు మకాం మార్చారు. అక్కడి కిరణ్ మోరే క్రికెట్ అకాడమీలో క్రునాల్, హార్దిక్లను చేర్చారు. అక్కడే ఆ సోదరులు క్రికెట్లో శిక్షణ పొంది భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగారు. తమకు మంచి కెరీర్ ఇవ్వడానికి ఎన్నో కష్టాలు పడిన తండ్రిని కోల్పోవడంతో పాండ్యా బ్రదర్స్ కన్నీరు మున్నీరవుతున్నారు. హిమాన్షు పాండే మృతి వార్త తెలిసిన వెంటనే తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సంతాపం తెలియజేశాడు బారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. "హార్దిక్, క్రునాల్ వాళ్ల నాన్న మృతి చెందారనే వార్త వినగానే గుండె బద్దలైంది. ఆయనతో రెండు మూడు సార్లు మాట్లాడాను. జీవితాన్ని ఎంతగానో ఆస్వాదించే వ్యక్తిగా ఆయన కనిపించారు. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక. హార్దిక్, క్రునాల్ గుండె నిబ్బరం చేసుకోండి." అంటూ ట్వీట్ చేశాడు.
మనిషి సాధించే విజయాలలో ఆత్మవిశ్వాసానిదే ముఖ్య పాత్ర. ఆ ఆత్మవిశ్వాసమే లేకపోతే, ఎంత ప్రతిభ ఉన్న ఫలితం గుండుసున్నాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలన్నా, తోటివారిని దాటుకుని దూసుకుపోవాలన్నా ఆత్మవిశ్వాసమే కీలకమంటూ వ్యక్తిత్వ వికాస నిపుణులంతా తెగ ఊదరగొట్టేస్తుంటారు. అయితే అతి సులభంగా ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరిచే చిట్కా ఒకదాన్ని పరిశోధకులు రూపొందించారు. ఆత్మవిశ్వాసాన్ని కొలిచారు జపానులోని క్యోటో నగరానికి చెందిన పరిశోధకులు ఓ ప్రయోగాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా వారు ఓ 17 మంది అభ్యర్ధులను ఎన్నుకొన్నారు. వీరితో చిన్నా చితకా పనులు చేయిస్తూ, ఆ సమయంలో వారి మెదడు పనితీరుని పరీక్షించారు. Decoded Neurofeedback అనే ఈ పరీక్ష ద్వారా వారు అభ్యర్థి మెదడులో ఆత్మవిశ్వాసపు స్థాయి ఏ తీరున ఉందో గమనించారు. బహుమతులు అందించారు అభ్యర్థులు కొన్ని పనులు చేసేటప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నట్లు గమనించారు. అలాంటి సమయంలో వారికి కొన్ని బహుమతులు అందించారు. పరిశోధకులు తమకు బహుమతులు ఎందుకు ఇస్తున్నారో అభ్యర్థులకు తెలియలేదు. కానీ వారి మెదడు మాత్రం ఆ ప్రతిఫలం పట్ల మంచి ఉత్తేజాన్ని పొందింది. అలా అభ్యర్ధికి తెలియకుండానే అతనిలో ఆత్మవిశ్వాసపు స్థాయిని పెంచే ప్రయత్నం చేశారన్నమాట. ఆత్మవిశ్వాసపు స్థాయి హెచ్చుగా ఉన్నప్పుడల్లా వారికి ఏవో ఒక పారితోషికాన్ని అందచేయడం వల్ల... ఆత్మవిశ్వాసం బలపడినట్లు గ్రహించారు. పెంచాలన్నా – తగ్గించాలన్నా ఇదే పద్ధతిని వ్యతిరేక దిశలో చేస్తే కనుక ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చునని అంటున్నారు పరిశోధకులు. అంటే మన మెదడులో ఆత్మవిశ్వాసం ఉండే స్థాయిని బట్టి, మనకి అందే ప్రతిఫలాలు దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయన్నమాట. ఈ పద్ధతిని ఉపయోగించి మున్ముందు మానసిక శాస్త్రవేత్తలు ఆత్మన్యూనతతో బాధపడేవారికి కొత్త జీవితాన్ని అందించవచ్చునని అంటున్నారు. డిప్రెషన్, అల్జీమర్స్ వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడేవారికి కనుక ఈ తరహా చికిత్సని అందిస్తే... వారి జీవన విధానం మెరుగవుతుందని ఆశిస్తున్నారు. ఈ పరిశోధన కేవలం నిపుణులకే పరిమితం అయినా, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు లేకపోలేదు. ఆత్మన్యూనతతో బాధపడే వ్యక్తులకు వారి చిన్నచిన్న విజయాలలో తోడుగా నిలబడి ప్రోత్సాహాన్ని అందించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పాదుకునే అవకాశం ఉంది. అలాగే బెరుకుగా, భయంగా ఉండే చిన్నపిల్లలకి ఏవో ఒక ప్రోత్సాహకాలు అందిస్తూ వారు ఏ లక్ష్యాన్నైనా సాధించగలరనే నమ్మకాన్ని కలిగించగలిగితే... వారి జీవితానికి ఓ భరోసాని అందించినవారమవుతాం. - నిర్జర.
కాలాన్ని జయించే ‘POSEC Method’
ప్రపంచంలో ఎవరికైనా రోజుకి 24 గంటలే ఉంటాయి. కానీ ఆ 24 గంటలని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారు అనేదాని మీద వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే 20వ శతాబ్దంలో ‘Time Management’కి చాలా ప్రాధాన్యతని ఇస్తున్నారు. వాటికోసం రకరకాల వ్యూహాలూ ప్రచారంలో ఉన్నాయి. అలాంటి ఒక పద్ధతే ‘POSEC Method’. 1943లో Maslow అనే ఆయన Hierarchy of needs అనే సిద్ధాంతాన్ని రూపొందించారు. ఒక మనిషి సంతోషంగా ఉండేందుకు ఎలాంటి అవసరాలు తీరాలో ఇందులో పేర్కొన్నారు. దీని ఆధారంగానే ‘POSEC Method’ని రూపొందించారు. మన అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ పద్ధతిలో సూచించే ప్రయత్నం చేశారు. అవేమిటంటే... Prioritize – మీ జీవితంలో అతిముఖ్యమైన లక్ష్యాలు ఏమిటి. వాటిని సాధించేందుకు ఏం చేయాలి. వాటి కోసం ఎంత సమయం కేటాయించాలి అన్న విషయాలన్నీ ఈ Prioritize కోవలోకి వస్తాయి. Organize – జీవితం స్థిరంగా ఉండేందుకు ఎలాంటి పరిస్థితులు అవసరం అన్న అంశాలు ఈ విభాగంలోకి వస్తాయి. ఉదాహరణకు కుటుంబం, ఉద్యోగం, ఆరోగ్యం... లాంటి అంశాలన్నమాట. Streamline – చేసే ప్రతి పనీ మనకి ఇష్టం లేకపోవచ్చు. కానీ జీవితం సాఫీగా సాగిపోవాలంటే వాటిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. సమయానికి బండిని సర్వీస్ చేయించుకోవడం దగ్గర నుంచీ, బీమా ప్రీమియం చెల్లించడం వరకు మన చుట్టూ ఉంటే పరిస్థితులను సక్రమంగా ఉంచుకోవడం వల్ల సమయం, శ్రమా రెండూ ఆదా అవుతాయి. Economize – కొన్ని పనుల వల్ల ఉపయోగం ఉండదు. అవి అత్యవసరమూ కాదు. కానీ ఇవి లేకపోతే జీవితం మరీ బోర్ కొట్టేయవచ్చు. స్నేహితులతో పార్టీ చేసుకోవడం, బంధువులు ఇంటికి వెళ్లడం, సినిమా చూడటం... లాంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. Contribute – పక్కవారికి ఏదో సాయం కావాలి! తోటి మనిషిగా ఆ బాధ్యతలో పాలు పంచుకోవడం మన కర్తవ్యం. వీధిలో జనం అంతా కలిసి రోడ్డుని శుభ్రం చేసుకుంటున్నారు! పౌరుడిగా పాల్గోవడం మన ధర్మం. ఎన్నికలు జరుగుతున్నాయి. పౌరుడిగా ఓటు వేసేందుకు లైనులో నిలబడటం మన బాధ్యత. ఇవన్నీ చేయాలని ఎవరూ అనరు. ఇలాంటి పనులు చేయడం వల్ల మనకి సమయం, శ్రమ వృధాగానే తోచవచ్చు. కానీ వీటి ఫలితం భవిష్యత్తులో కనిపించి తీరుతుంది. సమాజాన్ని ముందుకు నడిపించడంలో, మనం అశ్రద్ధ చేయలేదన్న తృప్తిని అందిస్తుంది. ఇలాంటి పనులన్నీ Contribute విభాగంలోకి వస్తాయి. ఇవండీ ‘POSEC Method’ లక్షణాలు. మన జీవితంలో పనులన్నింటినీ ఈ దృక్పథంతో చూస్తే... వేటికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎంత సమయం కేటాయించాలి అన్న స్పష్టత ఏర్పడుతుంది. - నిర్జర.
దేశంలో సంక్రాంతి – ఒకోచోట ఒకోలా!
సంక్రాంతి తెలుగువారికి ముఖ్యమైన పండుగ అన్న విషయం తెలిసిందే! మన పక్కనే ఉన్న తమిళనాడులో కూడా పొంగల్ పేరుతో దీనిని ఘనంగా జరుపుకుంటారనే విషయమూ చాలామందికి తెలుసు. కానీ దేశంలోని అనేక రాష్ట్రాలలో దీనిని వేర్వేరు పేర్లతో ఘనంగా చేసుకుంటారు. వాటిలో కొన్ని... పౌష్ సంక్రాంతి (పశ్చిమబెంగాల్) - పుష్య మాసంలో వస్తుంది కాబట్టి బెంగాలీయులు ఈ పండుగను పౌష్ సంక్రాంతి అని పిలుచుకుంటారు. వీరి పంటలు కూడా ఇప్పుడే ఇళ్లకు చేరుకుంటాయి. అలా ఇంటికి చేరిన కొత్త బియ్యానికి, ఖర్జూరపు బెల్లాన్ని కలిపి రకరకాల పిండివంటలు చేసుకుంటారు. మూడురోజులపాటు జరుపుకొనే ఈ పండుగ రోజుల్లో వీరు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఇక మకరసంక్రాంతి రోజునే గంగావతరణ జరిగిందని ఓ నమ్మకం. అది జరిగింది కోల్కతాకు సమీపంలో ఉన్న గంగాసాగర్ అనే ప్రాంతంలో కాబట్టి, అక్కడ ఉన్న గంగానదిలో స్నానామాచరించేందుకు లక్షలమంది తరలివెళ్తారు. పంజాబ్ (మాఘి) – తెలుగువారు భోగి జరుపుకొనే రోజునే పంజాబీయులు లోరి అనే పండుగ చేసుకుంటారు. ఈ రోజున విశాలమైన మైదానాలలో మంటలు వేసుకుని దాని చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ భాంగ్రా అనే సంప్రదాయ నృత్యం చేస్తారు. దీనికి అనుగుణమైన భాంగ్రా పాటలు పాడుతూ, డోలు వాయిస్తూ సాగే కోలాహలం చూసి తీరాల్సిందే! ఇక లోరి మర్నాడు ‘మాఘి’ పేరుతో పండుగ చేసుకుంటారు. పంజాబీల కాలమానం ప్రకారం మాఘి, మాఘమాసంలోని తొలిరోజు. మాఘినాడు పాలు, చెరుకురసంతో ఖీర్ చేసుకుంటారు. ఘుఘుటి (ఉత్తరాఖండ్) – ఉత్తరాఖండ్లోని కుమావ్ వంటి ప్రాంతాలలో సంక్రాంతిని భలే చిత్రంగా జరుపుకొంటారు. ఈ రోజుని వారు ఉత్తరాయణంలో మొదటి రోజుగా భావిస్తారు. చలికాలంలో వలస వెళ్లిపోయిన పక్షులన్నీ ఈ రోజు తిరిగివస్తాయని నమ్ముతారు. బహుశా పూర్వీకుల ఆత్మలకు ప్రతిరూపాలన్న నమ్మకం అనో ఏమో నల్లకాకులను కూడా ఈ రోజు స్వాగతిస్తారు. వాటి కోసం వెతికి మరీ రకరకాల తీపిపదార్థాలను అందిస్తారు. అందుకనే ఈ పండుగకు ‘కాలా కవ్వా’ (నల్లకాకి) అన్న పేరు కూడా ఉంది. సుగ్గి (కర్ణాటక) – కన్నడ భాషలో సుగ్గి అంటే పంట లేదా విందు అన్న అర్థం వస్తుంది. ఈ రోజున కన్నడిగులు కొత్తబట్టలు, పూజాపునస్కారాలతో పండుగన ఘనంగా చేసుకుంటారు. దీనికి తోడుగా అక్కడ ఓ చిత్రమైన సంప్రదాయం కూడా కొనసాగుతూ వస్తోంది. ఎల్లు బిరోదు పేరుతో నువ్వుల ఉండలను ఇచ్చిపుచ్చుకుంటారు. కర్ణాటకలోని స్త్రీలు ఈ నువ్వుల ఉండలతో పాటుగా, అరటిపళ్లు, చెరుకుగడలు, పసుపుకుంకుమలను ముత్తయిదువలకు పంచుతారు. మాఘ బిహు (అసోం) – అసోంలో సంక్రాంతి కూడా చాలా చిత్రంగా సాగుతుంది. సంక్రాంతి ముందురోజున వెదురు, ఎండుగడ్డి వంటివాటితో గుడిసెలను నిర్మించుకుంటారు. ఆ రోజంతా ఈ పాకలలో ఆడుతూపాడుతూ గడిపేస్తారు. మర్నాడు ఉదయం వీటిని తగలబెట్టేస్తారు. మన గోదావరి జిల్లాలలో కనిపించే కోడిపందాలు, ఎడ్లపందాల వంటి ఆటలు అసోంలో కూడా జరుగుతాయి. కొబ్బరి, నువ్వులతో రకరకాల పిండిపదార్థాలను చేసుకుంటారు. పైన చెప్పుకొన్న రాష్ట్రాలే కాదు! బీహార్, హర్యానా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్... ఇలా ప్రతి రాష్ట్రంలోనూ సంక్రాంతి ఏదో ఒక పేరున విభిన్నంగా జరుగుతూనే ఉంటుంది. దేశం ఒక్కటే అయినా అందులోని ప్రతి ప్రాంతానికీ తనదైన సంప్రదాయం ఉందన్న విషయాన్ని రుజువు చేస్తుంటుంది. - నిర్జర.
తెలుగు రాష్ట్రాలలో వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు హెల్త్ వర్కర్లకు అస్వస్థత
ప్రధాని మోడీ ప్రారంభించిన వ్యాక్సినేషన్ ప్రోగ్రాం రెండు తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతోంది. అయితే వ్యాక్సినేషన్ తో సైడ్ ఎఫెక్ట్ లు తప్పవని అందరు భావించినప్పటికీ అది అబద్ధమని రుజువు అయ్యింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారంతా క్షేమంగానే ఉన్నారు. ఏపీలోని విజయవాడలో వ్యాక్సిన్ తీసుకున్న రాధ అనే హెల్త్ వర్కర్ స్వల్ప అస్వస్థకు గురైనప్పటికీ.. ఆమె ఈరోజు ఉదయం నుండి ఏమీ తినకపోవటంతో పాటు వ్యాక్సిన్ అంటే ఉన్న భయంతోనే ఆమెకు కళ్లు తిరిగినట్లు వైద్యులు తేల్చారు. ఆమె ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. మరోపక్క తెలంగాణాలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం సజావుగా సాగుతోంది. అయితే సంగారెడ్డి జిల్లాలోని ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్ అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ తీసుకున్న ఏఎన్ఎం సంగీతకు స్వల్ప అస్వస్థత కలిగింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే తనకు తల తిప్పుతుందని ఆమె వైద్యులకు తెలిపింది. ఆ తర్వాత ఆమె వాంతులు చేసుకోవడంతో వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. అయితే, కొన్ని లక్షల్లో ఒకరికి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లు కనపడతాయని… భయపడాల్సిన పనిలేదంటున్నారు వైద్యులు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
ఎమ్మెల్యే ఆర్థర్ వర్సెస్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి.. ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాతో డీల్!!
కర్నూలు జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆధిపత్య పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎమ్మెల్యే ఆర్థర్ కు, వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి మధ్య అస్సలు పడదనేది బహిరంగ రహస్యం. తనపై పెత్తనం చేయాలని చూస్తున్నారని సిద్ధార్థరెడ్డిపై ఆర్థర్ ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే నియోజకవర్గంలో ఒకటి చోటుచేసుకుంది. రేషన్ షాపుల నుంచి ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం వాహనాలు సమకూర్చిన సంగతి తెలిసిందే. అయితే, లబ్ధిదారుల ఎంపిక విషయంలో సిద్ధార్థరెడ్డి కలుగజేసుకోవడంతో ఎమ్మెల్యే ఆర్థర్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారని, చివరికి అధికారులే కల్పించుకొని వివాదానికి తెరదించారని తెలుస్తోంది. నందికొట్కూరు నియోజకవర్గానికి అధికారులు 61 వాహనాలు కేటాయించారు. లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. అయితే, తుది నిర్ణయం తీసుకునే సమయంలో పాములపాడు మినహా మిగిలిన మండలాల్లో సిద్ధార్థరెడ్డి సూచించిన జాబితానే ఫైనల్ చేయాలని అధికారులపై ఒత్తిడి వచ్చిందట. దీంతో ఎమ్మెల్యే ఆర్థర్.. పార్టీ జిల్లా ఇంఛార్జ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారట. ఎమ్మెల్యే అయిన తనను ఒక్క మండలానికే పరిమితం చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాదు, అప్పటికే ఫైనల్ అయిన జాబితాను పక్కన పెడితే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతానని అధికారులకు ఫోన్ చేసి హెచ్చరించారట. దీంతో లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోయింది. ఇక చేసేదేమీ లేక అధికారులు 'ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా'ను తెరపైకి తీసుకొచ్చారట. పాములపాడు మండలం ఎమ్మెల్యేకు, పగిడ్యాల మండలం సిద్ధార్థరెడ్డికి ఇచ్చే విధంగా ఒప్పించారట. మిగిలిన మండలాలలతోపాటు నందికొట్కూరు అర్బన్, రూరల్ పరిధిలో ఇద్దరికీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తామని అధికారులు ప్రతిపాదన సిద్ధం చేశారట. అంటే సగం మంది లబ్ధిదారులను ఎమ్మెల్యే ఎంపిక చేస్తే.. మిగిలిన సగం మందిని సిద్ధార్థరెడ్డి ఎంపిక చేసేలా డీల్ కుదిర్చారన్నమాట. ఈ డీల్ కి ఇరువురు నేతలు ఒప్పుకోవడంతో వివాదానికి తెరపడిందని సమాచారం.
ప్రైవసీ పాలసీపై వాట్సాప్ వెనక్కి తగ్గింది. ఇటీవల తీసుకొచ్చిన ఈ పాలసీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం కావడం.. సిగ్నల్, టెలిగ్రామ్ వంటి యాప్స్ కు ఆదరణ పెరుగుతుండడంతో వాట్సాప్ వెనక్కి తగ్గింది. ప్రైవసీ పాలసీ ఆప్డేట్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. నిజానికి వచ్చే ఫిబ్రవరి 8 నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి రావాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో ఇది మూడు నెలలు వెనక్కి జరిగింది. కొత్త పాలసీపై ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్లడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాట్సాప్ తెలిపింది. పాలసీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ మూడు నెలలను ఉపయోగించుకుంటామని తెలిపింది. కొత్త విధానాన్ని యూజర్లు అర్థం చేసుకున్న తర్వాతే దానిని అమల్లోకి తీసుకొస్తామని స్పష్టం చేసింది. ప్రైవసీ పాలసీలో భాగంగా యూజర్ల వ్యక్తిగత సమాచారం, ఐపీ అడ్రస్ లను ఫేస్బుక్ తో పంచుకుంటామని, ఇందుకు అంగీకరిస్తేనే అకౌంట్ కొనసాగుతుందని ఇటీవల వాట్సాప్ ప్రకటించింది. అయితే, వ్యక్తిగత గోపత్యకు భంగం కలగనుందన్న ఉద్దేశంతో చాలా మంది యూజర్లు వాట్సాప్ ను డిలీట్ చేసి టెలిగ్రాం, సిగ్నల్ యాప్స్కి మారారు. దీంతో కాస్త వెనక్కి తగ్గిన వాట్సాప్.. కేవలం బిజినెస్ అకౌంట్స్ కు మాత్రమే ఇది వర్తిస్తుందని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ విమర్శలు తగ్గకపోవడంతో ఈ విధానాన్ని వాయిదా వేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు వాట్సాప్ తన బ్లాగ్లో "మీరు.. మీ కుటంబ సభ్యులు, స్నేహితులతో పంచుకునే సమాచారం ఏదైనా రహస్యంగానే ఉంటుంది. మీ వ్యక్తిగత సంభాషణని వాట్సాప్, ఫేస్బుక్ చదవదు. మీరు పంపే లోకేషన్లని చూడదు. మీరు ఎవరికి కాల్ చేశారు, ఎవరికి మెసేజ్ చేస్తున్నారనే విషయాలను కూడా మేం గమనించం. ఈ అప్డేట్ వల్ల ఏదీ మారడం లేదు. బిజినెస్ ఫీచర్స్ని మరింత మెరుగ్గా అందించడం కోసం మాత్రమే ఈ అప్డేట్ ని తీసుకొచ్చాం." అని తెలిపింది.
ఈ సింపుల్ యోగ ముద్రలతో ఎన్నో రోగాలు అరికట్టవచ్చు...
మానవ శరీరం లో ఉన్న ప్రతీ అవయవం చాల గొప్పది.. ఏది సరిగా పని చేయకపోయినా దాని ప్రభావం పూర్తిగా శరీరం పై పడుతుంది. కానీ ఒక్క అవయవం తో మనం మానసిక స్థితిని, భౌతిక స్థితిని , ఆధ్యాత్మిక స్థితిని కూడా పొందవచ్చని మీకు తెలుసా.. అది ఎలా అంటారా మనం చేతులతో ఎన్నో పనులు చేస్తుంటాం కానీ వాటితో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, మనకు తెలియదు. చేతి వేళ్ళని కొన్ని భంగిమలలో పెట్టె ప్రక్రియని ముద్ర అంటారు. మరి ఆ ముద్రలలో రకాలు వాటి వాళ్ళ మనకి కలిగే ప్రయోజనాలు అవి ఎలా వేయాలో చూద్దాం.. 1.జ్ఞాన ముద్ర: ఈ జ్ఞాన ముద్ర వేయడం వల్ల మనలో ఉన్న క్రియేటివిటీ పెరుగుతుంది , నాలెడ్జి కూడా ఇంప్రూవ్ అవుతుంది ,ఇంకా మన జ్యపకశక్తిని కూడా పెంచుతుంది. ఇంకా ఈరోజుల్లో చాల మంది నిద్రలేమి తో బాధపడుతున్నారు. ఈ ముద్ర వేయడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది. మరి ఈ ముద్ర వేయడం ఎలా అంటారా చాల సులభం. మనం బొటన వేలుని చూపుడు వేలుతో కలిపి ఉంచి మిగిలిన మూడు వెళ్ళాను నిటారుగా నిలపడమే ఈ జ్ఞాన ముద్ర. ఇది మనం ఎపుడైనా వేయవచ్చు నిల్చున్నపుడు , కూర్చున్నపుడు , నిద్రపోయేటప్పుడు ఇలా ఎప్పుడైనా వేయవచ్చు 2.సూన్య ముద్ర: ఈ ముద్ర ని ఎలా వేయాలంటే మన మధ్య వేలుని బొటన వేలు తో ఒత్తి ఉంచి మిగిలిన వేళ్ళను నిటారుగా నిలబెట్టాలి ,ఇలా రోజుకి కనీసం నలభై నిమిషాలైనా చేస్తే మన శరీరంలో ఉన్న dullness అనేది లేకుండా పోతుంది ,చెవి నొప్పి లాంటి సమస్యలేమైనా ఉన్న కూడా వెంటనే ఉపశమనం పొందవచ్చు ఇంకా మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది 3.ప్రాణ ముద్ర: ఈ ముద్ర ఎలా వేయాలంటే మన ఉంగరపు వేలుని ,చిటికెన వేలుని బొటనవేలికి టచ్ చేసి మిగిలిన రెండు వేళ్ళను నిటారుగా నిలబెట్టి ఉంచడమే ఈ ప్రాణ ముద్ర ,ఇది ఎప్పుడు ఐన వేయవచ్చు. ఇది వేయడం వల్ల మనలో ఉన్న రోగ నిరోధక శక్తి పెరుగుతుంది , ఇంకా బద్దకాన్ని నివారిస్తుంది, ఇంకా మానసికంగా , శారీరకంగా దృఢం గ ఉండేలా చేస్తుంది ,ఇంకా మన కంటిచూపు మందగించడాన్ని మెరుగుపరుస్తుంది ,ఈ ముద్ర వేయడం వల్ల మనిషి చాల ఆక్టివ్ గ ఉంచేలా చేస్తుంది 4.ధ్యాన ముద్ర: ఇది ఎలా చేయాలంటే మన రెండు చేతుల్ని అరచేతులు పైకి వచ్చేలా మన ఒడిలో పెట్టుకుని రెండు బొటన వేళ్ళు మాత్రమే టచ్ అయేలా ఉంచాలి. దీన్ని కదలకుండా నిటారుగా కూర్చుని శ్వాస మీద ధ్యాస ఉంచి ఎంతసేపైనా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది చిరాకు,డిప్రెషన్, స్ట్రెస్ లాంటి వాటినుండి చాల రిలీఫ్ ఉంటుంది. ఇది చాల పవర్ఫుల్ ముద్ర 5.బుద్ది ముద్ర: ఇది కూడా చాల ముఖ్యమైన ముద్ర మన చేతి బొటన వేలుని చిటికెన వేలితో కలిపి ఉంచి మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా ఉంచడమే ఈ బుద్ధి ముద్ర ఈ ముద్ర వేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా , మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మానసిక ప్రశాంతతని కోరుకునే ప్రతి ఒక్కరు ఈ ముద్ర లు తప్పక కంటిన్యూ చేయండి. 6.సూర్య ముద్ర: మన చేతి ఉంగరం వేలు ని బొటన వేలు కింద మడిచి పెట్టి మిగిలిన వేళ్ళను నిటారుగా నిలబెట్టి ఉంచడమే ఈ సూర్య ముద్ర ఈ సూర్య ముద్ర వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలి అనుకున్నవాళ్ళు ఈ ముద్ర చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. 7.ఆపాన ముద్ర: మన చేతి మధ్య వేలుని , ఉంగరం వేలుని బొటన వేలుతో కలిపి ఉంచి మిగిలిన వేళ్ళను నిటారుగా ఉంచడమే ఈ ఆపాన ముద్ర ఈ ముద్ర వేయడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇంకా మన శరీరంలోని వ్యర్ధ పదార్ధాలను బయటికి పంపిస్తుంది. 8.గణేష్ ముద్ర: మన రెండు చేతులను సగం పిడికిలి బిగించి ,రెండు చేతులను కలిపి బిగించి , మన ఛాతి భాగానికి పెట్టి నిటారుగా కూర్చుని ఈ ముద్ర వేయాలి. ఈ ముద్ర వేయడం వల్ల మన శరీర దారుఢ్యం చక్కగా ఉంచడానికి , మన కండరాల తీరు పని చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 9.వాయు ముద్ర: మన చేతిలో చూపుడు వేలుని మధ్యకి మడిచి బొటనవేలితో అదిమిపెట్టి మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా ఉంచడమే వాయు ముద్ర ఈ ముద్ర ని వేయడం వల్ల మన శరీరం లో ఉన్న చేదు గాలి బయటికి వచ్చి మన కి ఉన్న నొప్పులను తగ్గిస్తుంది. అంతేకాదు విపరీతమైన కీళ్ల, కండరాల నొప్పులను రాకుండా చేస్తుంది, ఇంకా మనం చిరాగ్గా అనిపించినపుడు కూడా ఈ ముద్ర వేస్తె ప్రశాంతంగా ఉంటాం.. https://www.youtube.com/watch?v=BFMHOO_XUE8
ముక్క లేనిదే ముద్ద దిగదు.. కొందరికి రోజూ ఉంటే, కొందరికి వారానికి ఒక్కసారైనా నాన్ వెజ్ లేనిదే ఆ వారం గడవదు. సండే వచ్చిందా పిల్లలకి పెద్దలకి పండగే. సండే వస్తే నాన్ వెజ్ ఉండాలి. పుట్టినరోజు పార్టీకి నాన్ వెజ్ ఉండాలి. పండగ వచ్చిందా నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇంకొన్ని చోట్ల ఆయా సంప్రదాయాలు అలవాట్లని బట్టి నాన్ వెజ్ తప్పనిసరిగా వండుకుంటారు. ఇలా ప్రతి సారీ అవకాశం దొరికినప్పుడల్లా ఈదేవి, ఎగిరేవి, పాకేవి అనే తేడా లేకుండా.. పిట్ట మాంసం, జింక మాంసం, పంది మాంసం, కుందేలు మాంసం ఇలా దొరికిందల్లా మీ పొట్టలోకి తోసేస్తే కొవ్వుపెరిగి గుండెలో కొలెస్ట్రాల్ చేరి, రక్తనాళాలు మూసుకు పోయి స్టెంట్లు వేసుకోడం ఒకబాధ. అసలు గుండె నొప్పి వచ్చినట్టు కూడా తెలియకుండా మనిషిని తీసుకుపోయే హృద్రోగ సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముక్కకోసం కాస్త కక్కుర్తి పడ్డారో గుండె లో సమస్యలు ఖాయమని నిపుణులు హెచ్చ్రరిస్తున్నారు. మాంసాహారము తినే వారిలో కార్డియో వాస్క్యులర్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్డియో వాస్క్యులర్ సమస్యలతోపాటు చనిపోయే అవకాశం ఉందని కార్డియో సర్జన్లు హెచ్చరిస్తున్నారు. అయితే చేపలు కొంత ప్రమాదం తక్కువే అని పేర్కొన్నారు . మాంసాహారము తింటున్న వారిపై ఇటీవల జరిపిన పరిశోధనలో చికెన్ ఇతర మాంస పదార్ధాల వల్ల కార్డియో వాస్క్యులర్ వ్యాధులు వచ్చే అవకావం ఉందని సాచురేటెడ్ ఫాట్స్ ఉంటాయని కార్డియో సమస్యకు దారితీస్తాయని హృద్రోగనిపుణులు తెలిపారు. న్యూయార్క్ కు చెందిన కర్నాల్ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో ఈ విషయం బయట పడిందని తెలిపారు.
యాంటీ స్నోరింగ్ డివైజ్ తో గురకకు చెక్