TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోడ్డుప్రమాదం: మాజీమంత్రి బాలరాజుకు గాయాలు

Published on: Thu Jun 19, 2014 11:27AM

 

 

 

రోడ్డు ప్రమాదంలో మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు విశాఖ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన ఒక వివాహ వేడుకలకు తన సన్నిహితులతో కలసి హాజరైన బాలరాజు తిరిగి వస్తుండగా విశాఖ జిల్లా నాతవరం మండలం ములగపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలరాజు గాయపడ్డారు. మంత్రి బాలరాజుతోపాటు విశాఖ డీసీసీ అధ్యక్షుడు పి.సతీష్ వర్మ, బాలరాజు సహాయకుడు ఒకరు కూడా గాయపడ్డట్టు సమాచారం. గాయపడిన ముగ్గురినీ నర్సీపట్నంలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో బాలరాజుకు ముఖం మీద స్వల్ప గాయాలయ్యాయని, సహాయకుడి పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్టు వైద్యులు చెబుతున్నారు. గురువారం తెల్లవారుఝామున కారులో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ అజాగ్రత్త కారణంగా కారు అదుపు తప్పి ఒక చెట్టుకు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.