బుధవారం బుద్దొచ్చింది ...

 

 

 

ఎట్టకేలకు సీమాంధ్ర ఎమ్మెల్యేలకు జ్ఞానోదయం అయినట్టే ఉంది. ఇప్పటిదాకా సమైక్య పార్టీ అనే క్రెడిట్ కొట్టేయడానికి తమలో తాము కొట్టుకుంటూ కూర్చున్న పార్టీల ప్రతినిథులంతా బుధవారం బుద్ది తెచ్చుకున్నారు. విభజించు పాలించు సూత్రాన్ని అనుసరిస్తూన్న కేంద్రం తమలో తమకు చిచ్చుపెట్టి విభజన కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేసేందుకు వ్యూహం రచించినట్టు కనిపిస్తుండటంతో ... ఇక అంతా కలిసి కేంద్రంపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో చకచకా చోటుచేసుకున్న పరిణామాల్లో ఇదే కీలక అంశం. కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీలకు చెందినా శాసనసభ్యులు కలిసికట్టుగా చేసే ... సమైక్యపోరాటంలో భాగంగా కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించనున్నామని తెలిపారు.