రుషికేష్ కి వెళ్ళిన వైకాపా నేతలు

 

 YSR Congress Party, Rushikesh,  Uttarakhand floods,  Uttarakhand floods news

 

ఉత్తరాఖండ్ లో వరద రాజకీయాల్లో ఇప్పుడు జగన్ పార్టీ నేతలు కూడా పాలుపంచుకుంటున్నారు. వరద బారిన పడిన తెలుగువారిని పరామర్శించడానికి వైకాపా నేతలు డెహ్రాడూన్, రుషికేష్ కి వెళ్ళారు. రుషికేష్ వద్ద హిమాలయన్‌ ఆస్పత్రిలో చికిత్స తెలుగు వారిని జగన్ పార్టీ నేతలు ఎమ్.వి.మైసూరారెడ్డి గొల్లబాబురావులు పరామర్శించారు. ఉత్తరాఖండ్ లో వైకాపా వైద్య విభాగం సేవలు అందిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్ వరద లో చిక్కుకుని, బతుకు జీవుడా అని సైన్యంతో రక్షింపబడి.. సొంతూర్లకు వెళ్ళాల్సిన వరద బాధితుల్ని తమ విమానాల్లో ఎక్కించేందుకు టిడిపి, కాంగ్రెస్ నేతలు పోటిపడుతున్నారు.