కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం.. ముఖ్య అతిథిగా జగన్

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. ఈ నెల 21న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాదు, త్వరలోనే విజయవాడకు స్వయంగా తానే వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నారు. అదేవిధంగా ఈ నెల 14న ఢిల్లీలో నిర్వహించనున్న నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లనున్న కేసీఆర్.. అక్కడ ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులను కలిసి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించే అవకాశం కూడా ఉంది.