టి20 అప్ డేట్ : స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతున్న టీం ఇండియా

20 ఓవర్లలో 127 పరుగుల లక్ష్య ఛేదనలో టీం ఇండియా తడబడుతోంది. కేవలం 26 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వికెట్లలో న్యూజిలాండ్ బౌలర్ల ప్రతిభ కంటే, భారత బ్యాట్స్ మెన్ నిర్లక్షమే ఎక్కువగా కనిపించింది. రైనా, యువరాజ్, ధావన్, రోహిత్ వికెట్లన్నీ నిర్లక్ష ధోరణితో పోగొట్టుకున్నవే. ధావన్ స్వీప్ కు ప్రయత్నించి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగితే, రోహిత్ ముందుకొచ్చి స్టంప్ అవుట్ అయిపోయాడు. యువరాజ్, రైనాలు కూడా చాలా సాధారణమైన షాట్లు ఆడి అవుటయ్యారు. ప్రస్తుతం క్రీజులో ఉన్న కోహ్లి(17, 16 బంతుల్లో) , ధోనీ (1, 3 బంతుల్లో) జంటపైనే భారత అభిమానుల ఆశలన్నీ ఉన్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News