ఏపీలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధమైందా?

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలకు అవసరమైన తెల్ల రేషన్‌ కార్డులు అక్రమంగా పలువురు దక్కించుకున్నారని, దాదాపు ఏపీలో 15 లక్షల బోగస్‌ కార్డులు ఉండి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేషన్‌ కార్డులను ఆధార్‌ కార్డులతో అనుసంధానం చేస్తే బోగస్‌ కార్డులన్ని పోయే అవకాశముందని ఏపీ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అర్హులైన పేద కుటుంబాల వారికి మాత్రమే రేషన్‌ కార్డులు ఉండేలా చర్యలు తీసుకునే దిశగా తెలుగు దేశం ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు సమాచారం.