నేడు తేలనున్న మమతా బెనర్జీ భవితవ్యం..


పశ్చిమ బెంగాల్ లో ఐదో విడత పోలింగ్ ప్రారంభమైంది. కోల్ కతా దక్షిణం, 24 పరగణ, హూగ్లీ జిల్లాల పరిధిలోని 53 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు ప్రముఖుల నియోజకవర్గాలున్నాయి.

 

కాగా ఈ ఎన్నికల్లో భాగంగా.. అరామ్ బాగ్లో సీపీఎం, టీఎంసీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో  సీపీఎం కార్యకర్తలకు గాయాలవ్వగా వారిని ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడ భారీగా బదోబస్తు ఏర్పాటు చేశారు.