విక్రమ్ గౌడ్ కు బెయిల్ మంజూరు...


కాంగ్రెస్ సీనియర్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ తనపై కాల్పులు జరిపించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈకేసులో భాగంగా విక్రమ్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఈ కేసులో భాగంగా.. విక్రమ్ గౌడ్ కు హైదరాబాదు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా రూ. 25వేల విలువైన రెండు షూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. పాస్ పోర్టును కోర్టుకు స్వాధీనం చేయాలని తెలిపింది. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని ఆదేశించింది.