విజయన’గరం’

 

విభజన నిర్ణయంతో భగ్గుమన్న విజయనగరంలో ఇంకా శాంతి భద్రతలు నెలకొనలేదు. నగరంలో కర్ఫ్యూ విధించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. మంత్రి బోత్సా సత్యనారాయణ ఆస్తులే లక్ష్యంగా సమైక్యవాదుల దాడులు చేస్తుండటంతో ఆయన ఆస్తులకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.

 

ఆంధోళనలు చేస్తున్న వారిపై సీఆర్‌పిఎఫ్‌ బలగాలు వ్యవహరిస్తున్న తీరుపై మహిళలు, వ్రుద్దులు ఆందోళనకు దిగారు. బోత్సా సత్యనారాయణకు చెందిన కాలేజి భవనంపై దాడికి దిగిన ఆందోళన కారులు భవనంతో  పాటు ఫర్నిచర్‌ను కూడా ద్వంసం చేశారు. కర్ఫ్యూ ఉన్నందున ప్రజలు భయటికి రావద్దని పోలీసులు చెపుతున్న ఆందోళన కారులు మాత్రం పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వస్తున్నారు.