సింధుని గుజరాత్‌లో సత్కరిస్తాం..

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధును సన్మానించేందుకు దేశంలోని వివిధ రాష్ట్రప్రభుత్వాలు, సంస్థలు పోటీ పడుతున్నాయి. తాజాగా ఆ లిస్ట్‌లోకి గుజరాత్ ప్రభుత్వం చేరింది. సింధుని తమ రాష్ట్రానికి పిలిపించి ఘనంగా సత్కరిస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. హైదరాబాద్ హైటెక్‌సిటీలో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సింధు ఒలింపిక్స్‌లో అద్భుతంగా ఆడిందని, అలాంటి ఆమెను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా మోడీ పాలనకు ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని..త్వరలో జరిగ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధిస్తామని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.