మాల్యా 8 కార్లు.. 14 లక్షలే..

 

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి ఎంచక్కా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యా ఆస్తులను వేలం వేసైనా సరే బ్యాంకుల తమ బకాయిలు వసూలు చేసుకోవాలనకుంటున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన విల్లా వంటిని వేలం వేశారు. ఇప్పుడు ఆయనకు చెందిన  కార్లను వేలం వేశారు. ఎనిమిది కార్లను కేవలం 14 లక్షలకు వేలం వేశాయి. వివరాల ప్రకారం.. ఎస్ బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ విజయ్ ఎస్ బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ విజయ్ మాల్యాకు చెందిన 8 కార్లపై ఆగస్టు 25 న ఈ వేలం నిర్వహించనుంది. అయితే కేవలం 14 లక్షల రూపాయలకు వేలం ప్రారంభించింది. అయితే ప్రస్తుతానికి కింగ్ ఫిషర్ హౌస్ బ్యాక్ యార్డులో ఉన్న ఈ కార్లు వేలంలో పాల్గొనాలంటే...ప్రతి వాహనానికి కోట్ చేసిన ధరలో 10 శాతం మొత్తాన్ని అంటే 2,000 రూపాయలు ఆగస్టు 23లోపు డిపాజిట్ చేయాల్సి ఉంది. అంతేకాదు ఈ కార్ల కండిషన్ పై అనుమానాలు ఉండి తనిఖీ చేయాలనుకుంటే జూలై 29 నుంచి ఆగస్టు 5 వరకు తనిఖీ చేసుకునే అవకాశాన్ని కూడా బ్యాంకు అదికారులు కల్పించారు. మరి 8 కార్లను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.