అదిపోయే సరికి కాంగ్రెస్ కు ఇప్పుడు గుర్తొచ్చిందా... వెంకయ్య

 

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఏదో ఒకటి చెప్పాలని అంటున్నకాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి ఏళ్లకు ఏళ్లు పైగా కాలయాపన చేసి.. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న తరువాత.. ఆఖరికి తమ పార్టీ ప్రయోజనాల కోసం తీరిగ్గా అప్పుడు రాష్ట్ర విభజన చేసింది. అలాంటిది ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి వారు విమర్శించడం.. ప్రత్యేక హోదా విషయంలో మోడీ మాట మీద నిలబడలేదు అని అనడం ఎటకారంగా ఉందని అన్నారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే.. ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు.. చట్టంలో ఎందుకు పెట్టలేదు..ఇప్పుడు ప్రతిపక్ష హోదా పోయిన తరువాత ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు హామీ ఇస్తే సరిపోతుందా’ అంటూ కాంగ్రెస్‌ను నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా పై నీతి అయోగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది.. దానిని బట్టి ఏపీకి ప్రత్యేకహోదాపై నిర్ణయం తీసుకుంటాం అని వెంకయ్య తెలిపారు.