పెను తుఫానుగా "వార్ధా"

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుఫాను మరింత బలపడి పెను తుఫానుగా మారింది. శ్రీహరికోట సమీపంలోనే రేపు తుఫాను తీరం దాటే అవకాశాలున్నాయని షార్ వాతావరణ విభాగ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తుఫాను ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది నెల్లూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 550 కి.మీల దూరంలో, అదే దిశగా మచిలీపట్నానికి 650 కి.మీ..తూర్పు చెన్నైకి 660 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. వార్థా తుఫాను బలపడుతుండటంతో దానిని ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలో ఇస్రో, ఇతర శాఖల అధికారులతో, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.