రోజులు దగ్గర పడ్డాయి.. వీహెచ్

 

కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతురావు మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శల బాణాలు వదిలారు.  పార్టీ కార్యకర్తలతో కలిసి మూకుమ్మడిగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించడానికి పూనుకున్న ఆయన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి.. రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అయినా అధికార ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టు వ్యవహరిస్తుందని విమర్శించారు. కేసీఆర్ రైతులపై వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాలేదని.. రైతుల గోడు పట్టించుకోకుండా ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలను లెక్కచేయకుండా.. కనీసం వారి కుటుంబాలను కూడా పరామర్శించకుండా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తీరుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. ఆయన నియంతృత్వ పాలనకు చరమగీతం పాడతారని ఎద్దేవ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu