ఉండవల్లి అందుకే జగన్ డ్రమ్స్ వాయిస్తున్నాడా?



ఉండవల్లి కామెంట్స్ ను చూస్తుంటే... జగన్ డైలాగ్స్ నే కొద్దిగా అటూఇటుగా మార్చి చెబుతున్నట్లు అనిపిస్తుంది. పట్టిసీమ ప్రాజెక్టు అయినా, రాజధాని అంశమైనా...సేమ్ టు సేమ్ ఇద్దరి వెర్షనూ ఒకేలాగా ఉంటుంది. జగన్ చెబుతున్నదే కరెక్ట్ అన్నట్లుగా, ఉండవల్లి వ్యాఖ్యలు ఉంటున్నాయని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. చంద్రబాబుకు తాను వ్యతిరేకం కాదంటూనే, ప్రభుత్వంపైనా, పార్టీపైనా ఉండవల్లి విమర్శలు చేస్తుండటంతో అప్రమత్తమైన తెలుగుదేశం నేతలు...ఎదురుదాడి మొదలుపెట్టారు. వైసీపీలో చేరే ఉద్దేశంతోనే ఉండవల్లి...జగన్ డ్రమ్స్ వాయిస్తున్నాడని, పైగా రాయలసీమ అభివృద్ధి చెందడం ఇద్దరికీ ఇష్టంలేదని, అందుకే పట్టిసీమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని గాలి ముద్దుకష్ణమనాయుడు ఆరోపించారు. అయితే గాలి ఆరోపించినట్లుగా ఉండవల్లి వైసీపీలో చేరతారో లేదో తెలియదు గానీ, ఉమ్మడి శత్రువైన టీడీపీని దెబ్బకొట్టేందుకు పరోక్షంగా సహకరించుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu