వేద పాఠశాల ప్రారంభించిన ప్రణబ్

 

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం ఆయి భీమవరంలో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన వేద పాఠశాల భవన సముదాయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం వేద పాఠశాల విద్యార్థులతో రాష్ట్రపతి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఎంపీలు మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu