20 మంది టీఆర్ఎస్ నేతలు టీడీపీలోకి....


తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకూ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకే జంపింగ్  లు జరిగాయి. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ నుండి నేతలు టీడీపీలోకి జంప్ అయ్యారు. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి సమక్షంలో దాదాపు 20 మంది టీఆర్ఎస్ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు. నిన్న తాండురులో టీడీపీ ఆధ్వర్యంలో  ప్రజాపోరు బహిరంగసభ జరగగా దానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. పరిగికి చెందిన 20 మంది టీఆర్ఎస్ నేతలు, ఇంకా  కాంగ్రెస్ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీఆర్ఎస్ వైఖరిపై నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అందుకే పార్టీ మారుతున్నారని..  కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ ప్రారంభమయిందని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu