దిక్కుతోచని దాసోజు శ్రవణ్!

 

 

 

టీఆర్ఎస్ పార్టీ తనకు ఎన్నికలలో టిక్కెట్ ఇచ్చేస్తుంది. తాను గెలిచేస్తానని కలలు కన్న టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్‌కి పార్టీ మొండిచెయ్యి ఇచ్చింది. శ్రవణ్ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఏ దశలోనూ పరిగణనలోకి తీసుకోలేదు. కనీసం శ్రవణ్ పేరును ప్రతిపాదించి, బలపరిచేవారు కూడా లేకపోవడంతో శ్రవణ్‌కి టిక్కెట్ గల్లంతయింది. ప్రజారాజ్యం పార్టీలో వున్నప్పుడు టిక్కెట్ ఆశించి భంగపడిన శ్రవణ్‌కి ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి భంగపాటు ఎదురైంది. తెలంగాణ ఉద్యమకాలంలో టీవీ ఛానెళ్ళలో సీమాంధ్రుల కడుపు మండే మాటలు అనడం, వితండవాదం చేయడం లాంటి పనుల్లో బిజీగా వున్న శ్రవణ్ తానేదో రాజకీయంగా ఎదిగిపోయానని కలలు కన్నాడు. ఇప్పుడు టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో వున్నాడు. దీనికితోడు దర్శకుడు తేజను బెదిరించిన కేసు వచ్చి నెత్తిన పడింది. అంతేలే.. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ అని ఊరకే అనలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu