కేవీపీకి హైకోర్టులో ఊరట

 

 

 

టైటానియం కుంభకోణం కేసులో అమెరికా రెడ్ కార్నర్ నోటీసులు ప్రకటించిన వైఎస్సార్ ఆత్మ కేవీపీ రామచంద్రరావుకు హైకోర్టు నుంచి ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ కేవీపీని అరెస్టు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర హోంశాఖ కార్యదర్శి, విదేశీ వ్యవహారాల కార్యదర్శి, సీబీఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.