ఏపీ రాజధానిపై ఇంకా ఏ నివేదికా రాలేదు: చంద్రబాబు

 

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ కేంద్ర హోం శాఖకు నివేదిక సమర్పించిందన్న వార్తలు వచ్చాయి. శివరామకృష్ణన్ కమిటీ ఫలానా ఫలానా సూచనలు చేసిందని, విజయవాడ - గుంటూరు ప్రాంతం రాజధానిగా బాగోదని చెప్పిందని, మార్టూరు - వినుకొండ - దొనకొండ మధ్యప్రాంతం రాజధానికి అనుకూలంగా వుంటుందని నివేదికలో పేర్కొందన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తల మీద కూడా ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు పలువురు స్పందిస్తూ రకరకాల వివరణలు ఇచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్ర రాజధానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి నివేదిక రాలేదని, రాజధాని విషయంలో మీడియాలో వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని చంద్రబాబు స్పష్టం చేశారు.