పట్టపగలు రైల్లో దోపిడీ..కుప్పంలో ఘటన

దోపిడీ దొంగలు రాత్రి పూటే కాదు పగలు కూడా తాము రైళ్లలో దోపిడీ చేయగలమని   నిరూపించారు. బెంగళూరు నుంచి చెన్నై వెళుతున్న మెయిల్‌‌ కుప్పం సమీపంలో దోపిడీకి గురైంది. మెయిల్‌లోని ఏసీ కోచ్‌లోని ప్రయాణికుల నుంచి 25 సవర్ల బంగారం, లక్ష రూపాయలకు పైగా నగదును దుండగులు దోపిడీ చేశారు. ఈ ఘటనపై కాట్పాడి రైల్వే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.  ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.