జగన్ సోనియా మాట వినుంటే..

 

ఎంపీ టీజీ వెంకటేష్ వరుస పెట్టి అందరిపై విమర్శనాస్త్రాలు విసురుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరిన టీజీ ఇప్పుడు వైకాపాపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి వైకాపా నేత జగన్ తొందరపాటు నిర్ణయమే కారణమని.. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడటంతోనే రాష్ట్రం ముక్కలైందని అన్నారు. జగన్ సీఎం పదవి కావాలని అనుకున్నారని, అలా అనుకోకుండా, సోనియా గాంధీ చెప్పిన మాట వినుంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో తెలియక రాష్ట్ర విభజనకు అంగీకరించింది. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు పడుతున్న కష్టాలకు ఒక రకంగా జగనే కారణమంటూ టీజీ ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ దొంగలేనని అన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు అనుభవించిన టీజీనే ఇలా వ్యాఖ్యానించడం ఆశ్చర్యకరమైన విషయం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu