కూకట్ పల్లి ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయండి.. టీ టీడీపీ

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఈ నెల 30 లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ని కలిసి సమావేశామయ్యారు. పార్టీ ఫిరాయించిన వాళ్లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరామని తెదేపా నేతలు తెలిపారు. అలాగే ఇటీవలే టీడీపీ నుండి తెరాస లోకి చేరిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావుపై కూడా అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరినట్టు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను అవమానపరుస్తున్నారని స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News