సీమాంధ్రులను తరిమేయడానికే సర్వే... వీడియో విడుదల...

 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే అసలు ఉద్దేశం హైదరాబాద్ నగరంలో సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన దాదాపు 55 వేల మంది ఉద్యోగులు, లక్ష మంది విద్యార్థులను ఈ నగరం నుంచి పంపేయడమేనంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేషీలో పీఆర్వోగా పనిచేస్తున్న విజయ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యల వీడియో తెలంగాణ తెలుగుదేశం పార్టీ మీడియాకి విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా నెట్వర్క్లో హల్చల్ చేస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే వేము నరేందర్ రెడ్డి ఈ వీడియోను విడుదల చేశారు. సమగ్ర కుటుంబ సర్వేపై సీఎం పీఆర్వో విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇందులో ఉన్నాయి.