తెలంగాణ కాంగ్రెస్ తో సాధ్యం: జానా

 

telangana congress, congress telangana, jana reddy telangana

 

 

కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణ ఇస్తుందన్న విశ్వాసం తనకు వుందని రాష్ట్ర మంత్రి జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో పదవులకు రాజీనామాలు చేశామని, అవసరమైతే కటిన నిర్ణయాలకు తీసుకొనేందుకు సిద్దమవుతామని ఆయన చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడమే నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న బహిరంగసభ ఉద్దేశమని జానారెడ్డి చెప్పారు. పార్టీ అధిష్టానానికి తెలంగాణపై ఎన్నో విజ్ఞప్తులు చేశామని ఆయన చెప్పారు. పార్లమెంటులోనూ శానససభలోనూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలియజేశామని ఆయన అన్నారు. ఈ నెల 30వ తేదీన జరిగే సభకు రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని, కాంగ్రెసు ద్వారానే తెలంగాణ సాధ్యమని చాటాలని ఆయన అన్నారు. రాయల తెలంగాణ, తెలంగాణ ప్యాకేజీలపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్చలు జరగలేదన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu