జనవరి నెలాఖరు నుండి తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు

 

జనవరి నెలాఖరు నుండి వారం రోజుల పాటు తెలంగాణా శాసనసభ సమావేశాలు నిర్వహించాలనుకొంటున్నట్లు స్పీకర్ మధుసుధానాచారి నిన్న మీడియాకు తెలిపారు. వరంగల్ జిల్లా చిట్యాలలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం తెలిపారు. హైదరాబాద్ వెళ్ళిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి శాసనసభ సమావేశాలు షెడ్యూల్ ఖరారు చేస్తానని తెలిపారు. జనవరి నెలాఖరులోనే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక ఆ తరువాతే సమావేశాలు నిర్వహించే అవకాశమున్నట్లు భావించవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu