తెలంగాణ అసెంబ్లీలో లొల్లి మొదలైంది

అనుకున్నట్లుగానే తెలంగాణ అసెంబ్లీలో లొల్లి మొదలైంది, రైతు ఆత్మహత్యలపై రెండ్రోజులపాటు చర్చించినప్పటికీ, తిరిగి అదే అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది, విపక్షాల వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో మొదలైన లొల్లి... 32మంది ఎమ్మెల్యేల సస్సెన్షన్ వరకూ వెళ్లింది, దాంతో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి రచ్చరచ్చ చేశారు, అయితే విపక్షాల తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు, సభను జరగనివ్వబోమనే రీతిలో విపక్షాలు ప్రవర్తించడం సరికాదని, బీఏసీ నిర్ణయాల మేరకు సభను నిర్వహిస్తున్నామన్నారు, రైతుల సమస్యలపై రెండ్రోజులపాటు చర్చించాం, ప్రభుత్వం ఏంచేయగలుతుందో చెప్పాం, కానీ సాధ్యంకాని వాటిని విపక్షాలు అమలు చేయమంటే ఎలా కుదురుతుందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయం నచ్చకపోతే నిరసన తెలిపాలే గానీ, ఇలా సభను అడ్డుకోవడం సరికాదని విపక్షాలకు కేసీఆర్ సూచించారు.