టిడిపి ఎంపి హ‌రికృష్ణ రాజీనామా

 

స‌మైక్యాంద్రకు మ‌ద్దతుగా మ‌రో ఎంపి రాజీనామ‌కు సిద్దమ‌య్యారు. తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు ఎన్టీఆర్ త‌ర‌యుడు నందమూరి హరికృష్ణ గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. స్పీప‌ర్ ఫార్మాట్‌లోనే రాజీనామ చేయాల‌ని నిర్ణయించుకున్నారు. గురువారం ఉద‌యం త‌న రాజీనామ ప‌త్రాన్ని చైర్మన్ హమీద్ అన్సారీకి సమర్పించనున్నారు.

గ‌త కొద్ది రోజులుగా హ‌రికృష్ణ స‌మైక్య వాదాన్ని బ‌లంగా వినిపిస్తున్నారు. ఇటీవ‌ల రాజ్యస‌భ‌లోనూ విభ‌జ‌న‌పై విరుచుప‌డ్డ హరికృష్ణ ఇప్పుడు రాజీనామ‌కు సిద్దం కావ‌టం చ‌ర్చనీయాంశం అయింది. అయితే హరికృష్ణ రాజీనామ‌తో మ‌రింత మంది నేత‌లు రాజీనామ బాట ప‌ట్టే అవకాశం ఉందంటున్నారు.