రేవంత్ రెడ్డి మూడోరోజు కస్టడీ.. జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నరేవంత్

 

నోటుకు ఓటు కేసు నేపథ్యంలో రేవంత్ రెడ్డి మూడో రోజు ఏసీబీ కస్టడీలో ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డికి జ్వరం, గొంతునొప్పితో ఆరోగ్యం సరిగా లేకపోవడంవలన పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఏసీబీ రేవంత్ రెడ్డిని విచారించనుంది. అయితే రేవంత్ రెడ్డికి సరైన సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించినా అవేమి పట్టించుకోవట్లలేదని, రేవంత్ కు సరైన సౌకర్యాలు కల్పించాలని అతని తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా పడిన నేపథ్యంలో ఈ రోజు ఏసీబీ అధికారులు కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu