అమ్మ మరణం తర్వాత తొలి కేబినెట్ భేటీ.. తీసుకున్న నిర్ణయాలు
posted on Dec 10, 2016 2:21PM
చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. అమ్మ మరణం అనంతరం పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించారు. ఇక జయ కన్ను మూసిన తరువాత పన్నీర్ సెల్వం అధ్యక్షతన ఈ రోజు మొదటిసారిగా రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. సమావేశానికి ముందు జయలలిత సమాధివద్ద పన్నీర్ సెల్వంతో పాటు ఆ రాష్ట్రమంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం సచివాలయ భవనంలోనూ జయలలిత చిత్రపటాన్ని ఉంచి ఆ ఫొటో ముందే కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ఈ సమావేశంలో కేటినేట్ పలు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అవి.
* జయలలిత పేరిట మెరీనా బీచ్ వద్ద ఘాట్ నిర్మాణానికి ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
* జయలలిత రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలను నిర్విఘ్నంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
* జయలలిత స్మారక విగ్రహాల ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది.