ఎఫ్డీఐ చిచ్చు : ఎంపీ సుజనా చౌదరీ రాజీనామా



రాజ్యసభలో యఫ్.డి.ఐ. ఓటింగుకి గైర్హాజరయిన తెలుగుదేశం సభ్యులు ముగ్గురుమీద, బయట పార్టీల వారేకాక స్వంతపార్టీ వారు సైతం మీడియాకేక్కి మరీ తీవ్రవిమర్శలు చేస్తుండటంతో, మనస్తాపం చెందిన సుజనచౌదరి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ లేఖని పార్టీ అద్యక్షుడు చంద్రబాబుకి నేడు పంపారు. తనవల్ల జరిగిన పొరపాటుకి పశ్చాతాపం వ్యక్తం చేసినాకూడా తమ స్వంతపార్టీ సభ్యులే తనపై ఈ విదంగా దాడిచేయడం సహించలేకనే రాజీనామా చేస్తున్నట్లు సుజనాచౌదరి తనలేఖలో చంద్రబాబుకి తన ఆవేదన వ్యక్తంచేస్తూ వ్రాసారు. మిగిలిన ఇద్దరు సభ్యులు దేవేందర్ గౌడ్ మరియు గుండు సుధారాణి కూడా రాజీనామాలకు సిద్దమేనని చంద్రబాబుకి తెలియజేసినట్లు సమాచారం. వారు నిజంగా కాంగ్రేసు ఒత్తిళ్ళకి లొంగి ఓటింగుకి గైర్హాజరయారా లేక వారు చెపుతున్నట్లు, ఓటింగుని తేలికగా తీసుకొని సభకు రాలేదా అనే విషయాన్నీ పక్కన బెడితే, తెలుగు తమ్ముళ్ళు వారికి తమపార్టీ అద్యక్షుడు రాజ్యసభ టికెట్లు ఇవ్వడంపై ఎంతరగిలి పోతున్నారో ఈ సంఘటనతో బయట పడింది.