ట్వీట్ తో సస్పెన్స్ లో పడేసిన స్వామి...

 

ఎప్పుడూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఈసారి ట్వీట్లతో దుమారం రేపుతున్నారు. రెండు రోజుల క్రితం స్వామి.. జీఎస్టీ బిల్లుపై ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. జీఎస్టీ బిల్లు వల్ల సాధారణ ప్రజాలకు ఒనగూరే లాభాల కంటే నష్టాలే ఎక్కువని, ప్రభుత్వాలు ప్రైవేటు యాజమాన్యాల చెప్పుచేతల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ట్వీట్ చేసి కాకపుట్టించారు. ఇప్పుడు మరో ట్వీట్ చేసి అందరిని సస్పెన్స్ లో పడేశారు. అదేంటంటే.. ముడి చమురు ధరలో మీరు నిపుణులైతే...డిసెంబర్ లో పెట్రోలు ధర ఎంత ఉంటుందో ఊహించగలరా? అని ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అంతేనా ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో రేపు సమాధానం చెబుతానని అని మరో ట్వీట్ లో ట్విస్ట్ ఇచ్చారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 60 డాలర్లను దాటితే మన ఆర్ధిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉండనుంది? అని ఆయన ట్వీట్ చేశారు. మొత్తానికి మళ్లీ జీఎస్టీ బిల్లు ద్వారా తమ ప్రభుత్వంపైనే స్వామి ఇన్ డైరెక్ట్ గా విమర్శలు చేశారు. దీనికి పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో.. ముందు స్వామి గారి ట్వీట్ కు ఎంతమంది రెస్పాండ్ అవుతారో చూడాలి.