వీర్రాజుకు వెంకన్న కౌంటర్.. చంద్రబాబును అంటే సహించం

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు టీడీపీ పై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ, టీడీపీ మిత్రపక్షం కాబట్టి వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలకు ఒకింత కోపం వచ్చినా వినివిననట్టు వదిలేశారు. అయితే ఇప్పుడు అలా కాకుండా వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కూడా రివర్స్ కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టున్నారు. దీనికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. వీర్రాజు చేసిన విమర్శలకు గాను వెంకన్నస్పందిస్తూ చంద్రబాబు భిక్ష వల్లే వీర్రాజు ఎమ్మెల్సీ అయ్యారని ఆ విషయం ఆయన మర్చిపోయారేమో అని కౌంటర్ ఇచ్చారు. మంత్రి పదవి కోసమే వీర్రాజు టీడీపీని విమర్శిస్తున్నారని.. ఇలాంటి వారిపై బీజేపీ పెద్దలు దృష్టిసారించాలని సూచించారు. అంతేకాదు తమ అధినేత చంద్రబాబుకు మచ్చతెచ్చేలా మట్లాడితే సహించేది లేదని బీజేపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu