సింగరేణి కార్మిక ఎన్నికల్లో త్రిముఖ పోటీ?
posted on Jun 18, 2012 11:24AM
ఈ నెల 28న జరగనున్న సింగరేణి కార్మిక గుర్తింపు సంఘ ఎన్నికల్లో త్రిముఖపోటీ నెలకొంది. ఎ.ఐ.టి.యు.సి., ఐ.ఎన్.టి.యు.సి. టి.బి.జి.కెన్. యూనియన్లు పోటీపడుతున్నాయి. ఈ సంస్థ 11 ఏరియాల్లో విస్తరించి ఉంది. ఇప్పటికి మూడుసార్లు ఎ.ఐ.టి.యు.సి., ఒకసారి ఐ.ఎన్.టి.యు.సి. ఈ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో గెలుపొందాయి. ఇప్పటికే 11 ఏరియాల్లో 3 ఏరియాల్లో టి.బి.జి.కెన్. విజయం సాధించింది. కొన్ని ప్రాంతాల్లో ఈసారి చతుర్ముఖపోటీ తప్పదని అంచనాలు వినిపిస్తున్నాయి. సి.ఐ.టి.యు. ఈ చతుర్ముఖపోటీలో పై మూడు యూనియన్లతో పోటీపడుతుంది. దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న ఈ సింగరేణి పరిశ్రమలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు ఇటీవల ముగిసిన ఉపఎన్నికల కన్నా సీరియస్ గా జరుగుతున్నాయి. యూనియన్లు అన్నీ తాము గుర్తింపు యూనియన్ గా ఎన్నికైతే కర్ముకులకు ఏమి చేయాలనుకుంటున్నాయో అజెండారూపంలో తెలిపే కరపత్రాలను కూడా పంపిణీ చేశాయి. ఇటీవల కార్మికులను నేరుగా కలిసిన యూనియన్ల నాయకులు ఇప్పటిదాకా తమ సంఘం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాయో విశాదీకరించాయి. దీంతో ఏ సంఘానికి ఓటు వేయాలనే అంశంపై కార్మికులు చర్చిస్తున్నారు. అంతేకాకుండా యూనియన్ అజెండాల్లో ఉన్న కీక అంశాలు కూడా ఈ చర్చల్లో నలుగుతున్నాయి. అయితే కొత్తగా తెలంగాణావాదాన్ని ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టేందుకు టి.బి.జి.కెన్. ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతీయతా బేధాలు కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో మంచిది కాదని ఏ.ఐ.టి.యు.సి, ఐ.ఎన్.టి.యు.సి. తదితర యూనియన్లు కార్మికులకు వివరించాయి.