శక్తిమాన్ విగ్రహ ఆవిష్కరణ...

 

పోలీస్ అశ్వం శక్తిమాన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ లోని హరీశ్ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసన తెలిపిన నేపథ్యంలో.. గణేష్ జోషి అనే భాజపా ఎమ్మెల్యే శక్తిమాన్ పై దాడి జరిపిన సంగతి విదితమే. ఆ దాడిలో శక్తిమాన్ కాలు విరిగిపోగా.. దాని కోసం విదేశాల నుండి కృత్రిమ కాలు తెప్పించారు. ఆపరేషన్ చేసి కృత్రిమ కాలు అమర్చారు. అయితే కొన్నిరోజులు బాగానే ఉండి.. ఇంకా కోలుకుంటుంది అనే లోపులోనే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఇప్పుడు శక్తిమాన్ గుర్తుగా ఓ విగ్రహాన్ని తయారు చేయించారు.  ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ డెహ్రాడూన్‌ పోలీస్‌ లైన్‌లో శక్తిమాన్‌ విగ్రహాన్నిఆవిష్కరించనున్నారు. ఏప్రిల్‌ 20న శక్తిమాన్‌ కన్నుమూసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News