ఏడుగురు మాజీ సీఎంలు ఇప్పుడు కేంద్ర మంత్రులు

కేంద్రంలో ముచ్చటగా మూడో సారి నరేంద్రమోడీ ప్రభుత్వం కొలువుదీరింది. మోడీ కేబినెట్ లో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉండటం విశేషం. ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులలో ఏడుగురు మాజీ మంత్రులు ఉన్నారు.

వారిలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్,  ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం రాజ్ నాథ్ సింగ్ ఉన్నారు. అలాగే హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ ఉన్నారు.

 అలాగే బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ ఉణ్నారు. ఈ ఏడుగురు మాజీ సీఎంలలో ఐదుగురు బీజేపీకి చెందిన వారే కాగా మిగిలిన ఇద్దరూ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన వారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News