సీమాంధ్ర మంత్రుల రాజీనామా
posted on Oct 3, 2013 8:54PM
తెలంగాణ నోట్కు కేంద్రం ఆమోదం తెలపటంతో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి.. మొదటి నొంచి తెలంగాణ నోట్కు మోదం నపడితే రాజీనామ చేస్తామంటూ వస్తున్న మన రాష్ట్రనికి సంభందించిన జాతీయ నాయకులు ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తమ సమక్షంలోనే తెలంగాణ నోట్కు ఆమోదం పడటంతో సమావేశంనుంచి మధ్యలోనే బయటికి వచ్చిన పళ్లంరాజు, కావూరి సాంబశివరావులు రాజీనామ చేసే లోచనలో ఉన్నారు. వీరితో పాటు మరో కేంద్ర మంత్రి చిరంజీవి కూడా రాజీనామకు అనుకూలంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
వీరితో పాటు ఎంపిలు అనంతవెంటకట్రామి రెడ్డి, సబ్బం హరిలు, తమ ఎంపి పదవులతో పాటు కాంగ్రెస్ పార్టికి కూడా రాజీనామ చేస్తున్నారు. ఉండవల్లి, హర్షకుమార్, కెవిపి, పురందరేశ్వరి లాంటి మరింత మంది నేతలు ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.