48 గంటల సీమాంద్ర బంద్‌

 

 

తెలంగాణ నోట్‌కు సంభందించి కేభినెట్ ఆమోదం లభించటంతో సీమాంద్ర భగ్గుమంది.. సమైక్యాంద్ర పరిరక్షణ సమితి తరుపున ఏపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌ బాబు రేపు దయం 6 గంటల నుంచి 48 గంటల పాటు బంద్‌కు పిలుపు నిచ్చారు.

 

ఎపిఎన్జీవో భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన 48 గంటల పాటు కేంద్ర కార్యాలయాలతో పాటు రహాదారులు, అన్ని ఆఫీస్‌లు, బ్యాంక్‌లు బంద్‌ చేయాలని నిర్ణయించారు. బంద్‌లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాయకులను కోరారు.

 

ఇప్పటికైనా కేంద్ర మంత్రులు ఎంపిలు రాజీనామాలు చేసి ప్రజా ఉధ్యమంలోకి రావాలని కోరారు.. ఇప్పటికీ ఉద్యమంలోకి రాకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.