వీళ్లని చూసి గర్వపడుతున్నా-సచిన్

రియో ఒలింపిక్స్‌లో మువ్వన్నెల జెండాను ఎగురవేసి భారతదేశానికి పతకాన్ని సాధించి పెట్టిన పీవీసింధు, సాక్షి, దీపలను చూసి తాను గర్వపడుతున్నానని అన్నారు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఒలింపిక్స్‌ స్టార్లను సన్మానించేందుకు ఆయన ఇవాళ హైదరాబాద్ వచ్చారు. పుల్లెల గోపిచంద్ అకాడమీలో ఒలింపిక్ విజేతలకు సచిన్ బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ క్రీడలకు ఇది శుభదినమని..ఈ విజయయాత్ర ఆగకూడదని ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఒలింపిక్స్‌లో ప్రతిభ చూపిన క్రీడాకారులను ప్రోత్సహించడం సంతోషంగా ఉందన్నారు. సింధుని గోపిచంద్ చక్కగా ప్రోత్సహించారన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News