రాజ్‌భవన్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు.. నరసింహన్ కు ఫిర్యాదు


వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ ఎంట్రీపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. ఒకవైపు మార్షల్స్ రోజాను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకుండా అడ్డుపడుతుంటే మరోపక్క.. జగన్, రోజా వైసీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్ తో వాగ్వాదానికి దిగారు. అయినా లోపలికి వెళ్లనివ్వకపోవడంతో విషయంపై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేస్తూ వెళ్లారు. అయితే ముందుగా గవర్నర్ తో ఫోన్లో మాట్లాడిన జగన్ ఆయన అందుబాటులో లేకపోవడంతో వినతిపత్రాన్ని గవర్నరు ఆఫీసులో ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది.

 

మరోవైపు రోజా సస్పెన్షపై హైకోర్టు డివిజన్ బెంచ్ పై పిటిషన్ దాఖలు చేసిన అసెంబ్లీ కార్యదర్శి. సోమవారానికి ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.