మందుబాబుల‌ తెగింపు!  మద్యం దుకాణం లూటీ!

మ‌ద్యం దొర‌క్క‌పోవ‌డంతో ఎలాగైనా తాగాల‌నే త‌ప‌న మందుబాబులను ఎంత‌టికైనా తెగించేలా చేస్తోంది. కొంతమంది వ్యక్తులు మానసికంగా వింతగా ప్రవర్తిస్తున్నారు. మ‌రికొంత మంది ఆత్మహత్యలకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దొరికితే  బ్లాక్‌లోనైనా కొని తాగేస్తున్నారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో హైద‌రాబాద్‌లోని మద్యం షాపుల‌న్నీ బంద్ వున్నాయి. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ వేంకటేశ్వర వైన్స్ షాప్‌లో మద్యం లూటీ జరగ‌డం స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది. షాప్ పైభాగం రేకులు కట్ చేసి లోపలికి ప్రవేశించి మందు బాటిల్స్‌ను ఎత్తుకెళ్లిన‌ట్లు గుర్తించారు. ఈ దృశ్యాల‌న్నీ సీసీటీవీలో రికార్డ్ అయాయి. వీడియోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

అంతే కాదు హైద‌రాబాద్  ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి వ‌చ్చే మందుబాబుల సంఖ్య కూడా ఎక్కువైతోంద‌ట‌. ఈ వారం రోజుల్లోనే  1000కి పైగా మందుబాబులు ఎర్రగడ్డ ఆస్పత్రి వ‌చ్చిన‌ట్లు సూపరింటెండెంట్‌ ఉమాశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు.