ట్విట్టర్లో వర్మ టార్గెట్... చిరంజీవి

 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి ట్విట్టర్లో చిరంజీవిని టార్గెట్ చేశాడు. రంజీవి తన 150వ సినిమాకు తానే దర్శకత్వం వహించాలని వర్మ సూచించాడు. అలా చేయకపోతే ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం కంటే కూడా పెద్ద తప్పు అవుతుందని అన్నాడు. దర్శకులకంటే ఆయనకే ఎక్కువ విషయాలు తెలుసని, ఆయనని కలసినప్పుడు తనకు ఆ విషయం అర్థమైందని వర్మ ట్విట్ చేశాడు. త్రివిక్రమ్, వినాయక్ లాంటి వాళ్లతో చిరంజీవి 150వ సినిమా చేస్తే అది ఏదో మామూలు సినిమా అవుతుందని, అదే ఆయన దర్శకత్వం వహిస్తే గొప్ప సినిమా అవుతుందని వర్మ చెప్పాడు. చిరంజీవి దర్శకత్వం వహించే సినిమా ఆయన మూడు దశాబ్దాల సినీ చరిత్రలో అద్భుతమైన ఘట్టం అవుతుందని వర్మ చెప్పాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సినిమా చిరంజీవికి మరో బాహుబలి అవుతుందని అన్నాడు. ఇంతకీ వర్మ చిరంజీవిని తిట్టాడా పొగిడాడా అన్న విషయం మాత్రం అర్థం కావడం లేదు.