రాఖీయాదవ్‌కి జుడిషియల్ కస్టడీ..

 

తమ కారును ఓవర్ టేక్ చేశాడన్న కారణంతో పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన జేడీయూ ఎమ్మెల్సీ మనోరమ దేవి కుమారుడు రాఖీయాదవ్‌ ఓ యువకుడిని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా రాఖీయాదవ్‌కు కోర్టు 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది. మరోవైపు రాఖీయాదవ్ మాత్రం..ఈ సంఘటన జరిగిన రోజు తాను గయ నగరంలోనే లేనని.. తాను నిర్దోషినని అంటున్నాడు.