కాంగ్రెస్ పార్టీ నుంచి రాజయ్య సస్పెన్షన్

posted on: Nov 8, 2015 3:53PM

 

కోడలు, మనవళ్ళ మరణం కేసులో ఇరుక్కున్న వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం నాడు ప్రకటించారు. రాజయ్య కుటుంబంతో ఆయన కోడలు సారికకు వున్న మనస్పర్థల వల్ల ఈ ఘోరం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. సారిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాజయ్యను, ఆయన భార్యను, కుమారుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. రాజయ్య కుటుంబం సారికను మానసికంగా, శారీరకంగా హింసించేవారన్న ఆరోపణలు బలంగా వినిస్తూ వుండటంతో కాంగ్రెస్ నాయకత్వం ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...