నిర్మాత నాగిరెడ్డి దుర్మరణం

 

హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నిర్మాత నాగిరెడ్డి దుర్మరణం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ‘పెళ్లైన కొత్తలో’ సినిమా దర్శకుడు మదన్ దర్శకత్వంలో ‘పెళ్ళి పుస్తకం’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. నిర్మాత నాగిరెడ్డి, దర్శకుడు మదన్ కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నాగిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయను గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. దర్శకుడు మదన్ స్వల్పంగా గాయపడ్డారు.