ప్రకాశం హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ మద్య ఘర్షణ


ప్రకాశం జిల్లాలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మద్య ఘర్షణ జరగడంతో జిల్లాలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. నిన్న రాత్రి జిల్లాలోని పరుచూరు మండలం ఇనగల్లులో టీడీపీ, వైసీపీ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఇరు పార్టీకి చెందిన కార్యకర్తలకు గాయాలైనట్టు తెలుస్తోంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన చోటే పికెట్ ఏర్పాటు చేసిన పోలీసులు.. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu