బ్లాక్ మనీకి మోడింది..రూ.1000, 500 నోట్లు రద్దు

ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నల్లధనాన్ని కట్టడి చేస్తామని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతున్న మోడీ ఆ ప్రయత్నంలో తొలి అడుగు వేశారు. పాత రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ అర్థరాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 30లోగా రూ.500, రూ.1000 నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని ప్రధాని తెలిపారు. సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.  అయితే ఈ నెల 11 వరకు వైద్య సేవలు, రైలు టికెట్ల కోసం రూ.500, రూ 1000 నోట్లు వినియోగించుకోవచ్చని ప్రధాని వెల్లడించారు. డిసెంబర్ 30లోపు డిపాజిట్ చేయనివారు..ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం డిపాజిట్ చేయవచ్చని తెలిపారు.