కిసాన్ ఛానల్ ప్రారంభించిన మోడీ

ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో దూరదర్శన్ కిసాన్ ఛానల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతోనే ఆర్ధికాభివృద్ధి సాధ్యమని, వ్యవసాయంతో గ్రామాలు.. గ్రామాలతో దేశాభివృద్ధి జరుగుతుందని అన్నారు. వ్యవసాయం, గ్రామాలు, దేశాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని, వ్యవసాయం తరువాతే వ్యాపారం ఉద్యోగం అని అన్నారు. దేశంలో రైతులదే అతి పెద్ద కుటుంబమని, కృతిమ ఎరువుల గురించి తెలియనప్పుడే సేంద్రియ ఎరువులు ద్వారా రైతులు బాగా పండించేవారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేంద్రమోడీ తోపాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్, కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ రాఠోడ్ తో పాటు పలు అధికారులు వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొన్నారు.